బీజేపీ వైసీపీ పెద్దలూ మచ్చ చెరిపి, ప్రజలకు ఆదర్శంగా, కుటుంబాన్ని విడదీయక, ఒక పార్టీ లోనే ఉంచండి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,895; 104 తత్వాలు (Tatvaalu) and views 226,212.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇవి తప్పులు ఎత్తి చూపడానికి కాదు, సరిచేసుకోవడానికి. ఇప్పుడు అయినా అభివృద్ధి చేతలలో, చీరాల పర్చూరు ప్రాంతాల్లో బీజేపీ వైసీపీ అండతో చేయించడానికి మాత్రమే.

బీజేపీ ఖచ్చితంగా సాంప్రదాయం పాటిస్తూ, నియమాలు ను ఎక్కువ శాతం పాటిస్తూ ఉంటుంది, సాధారణంగా. కానీ, కొన్ని సార్లు బోర్లా పడుతుంది, కొంతమంది నాయకుల ఉదాసీనత వలన. టీడీపీ సానుభూతి పరులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా, రమేష్ లాంటి వారికి ఆశ్రయం ఇవ్వడమే గాక, తెదేపా అనుకూల వాదనలకు అవకాశం ఇచ్చారు ఇన్నాళ్లు. కానీ వీర్రాజు గారి రాకతో, ఇక వారి తెదేపా అనుకూల ఆటలు సాగవు. బీజేపీ ఎదుగుదలకు ఉపయోగము.

ఇప్పుడు అయినా, కొత్త వారు, కనీసము సొంత కుటుంబము మొత్తము అయినా, పార్టీలో ఉండేవారిని చేర్చుకోవాలని అభిమానుల ఆకాంక్ష. ఇతర పార్టీల లాగా కాకుండా, బాధ్యతగా నియమాలతో ఉంటాము కాబట్టి, ఉన్న పార్టీ సభ్యులు కూడా, దీనిని పాటిస్తే బాగుంటుంది అని వారి అభిలాష.

అలా కాకుండా, జీవిత భాగస్వామి తెదేపా లో, కుమారుడు వైసీపీలో ఉంటే బాగోదు కదా, జాతీయ పార్టీ అయి ఉండి. సొంత ఇంట్లో నే బీజేపీ గురించి సర్ది చెప్పుకోలేని నాయకుడు, ఇతరులకు ఏమని న్యాయం వివరించి చెప్పి, మన పార్టీ వైపు తెస్తారు? ప్రజలు ఎలా నమ్ముతారు?

ఇతర నాయకులు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావ బావ మరుదులు వేరు. కాని ఒకే కుటుంబ భార్య భర్త కుమారుడు వేరు. రెండు ఉదాహరణలు ఒకటి కాదు, వేరు వేరు పార్టీలలో ఉండటము. అవకాశవాదాన్ని ఏ విధముగా అయినా, సమర్ధించుకోవచ్చు, కానీ ప్రజలు తిరస్కరించారు.

ఉదాహరణకు, పర్చూరు విషయములో, గతములో వైసీపీ ఇదే విషయములో దెబ్బతిన్నది కదా, గత 2019 ఎన్నికలప్పుడు, అని ఇరు పార్టీల అభిమానుల ఆందోళన. ఎన్నికలప్పుడు ఏలూరి గారి మాటలు, పురందేశ్వరి గారి మాటలు, ఎన్నికల తర్వాత, దగ్గుబాటి ఆలోచనలు వీడియోలో చూడండి.

అన్న ఎన్టీఆర్ గారంటే ఒక గౌరవం, ఒక పద్ధతి, ఒక గౌరవం. ఆ కుటుంబం అన్నా, ఒక పద్ధతి సాంప్రదాయం, ఒకమాట ఒకబాట, ఆదర్శంగా ఉంటారు అందరికీ.

ఇక అందరం గౌరవం గా చిన్నమ్మ గా పిలిచే, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి గారు, చాలా ఏళ్లుగా విశ్వాసం గా బీజేపీ లో ఉన్నారు. ఆమె నిబద్ధత ను ప్రశ్నించలేము, మంచి వక్త కూడా. కానీ వారి భర్త ను అంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారిని, అబ్బాయి ని, ఇన్నాళ్ల అనుభవం తో, బీజేపీ సిద్ధాంతాన్ని గొప్పతనాన్ని మోడీ నాయకత్వ బలాన్ని చెప్పి, ఒప్పించలేకపోవడం మాత్రం, ఒక మచ్చ గా మిగిలి పోతుంది.

ఎందుకంటే, తన సొంత కుటుంబం కే నచ్చ చెప్పుకోలేని నాయకులు, ఇక ప్రజలకు ఏమని నచ్చ చెపుతారు పార్టీ భావజాలం? ఇక తమ స్నేహితులు, బంధువులను ఎలా బీజేపీ వైపు లాగుతారు? ఆ కళంకం, మంచి విలువ లు కలిగిన, బీజేపీ పై రుద్దడం భావ్యమా? బీజేపీ, ఆ మచ్చ ను సరిచేసుకోలేదా? లేదు, చిన్నమ్మ గారికి కూడా ఆనాడే, వైసీపీ సిద్ధాంతం జగన్ నాయకత్వం నచ్చిన, అందరూ ఇటువైపే ఉండి పర్చూరు లో వైసీపీ ని బలోపేతం చేయవచ్చు ను గదా?

లేదా ఇంట్లో వారిని కట్టడి చేసి ఉండాలి కదా నచ్చ చెప్పి. గౌరవముగా మంచి పదవిలో ఉన్న, మనకు ఇలాంటి పిచ్చి చేష్టలతో, తలనొప్పి తేవద్దని. మొదటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారిది, పొరపాటు బాటనే, అన్ని తప్పిదాలే, ముందు చూపు లేని పనులే. ఇప్పుడు అవి, యువనాయకుడి భవిష్యత్ కు అడ్డంకులు అవుతున్నాయి. అనవసరముగా చిన్నమ్మ గారి ఎదుగుదలకు అడ్డుగా అవుతుంది, వారి పనులు.

చీరాల పరిసర ప్రాంతాలలో, ఇద్దరు కూడా, ఎంపీలు గా అభివ్రుద్ది లో, ఒక సుస్థిర స్థానం సంపాదించుకోలేక పోయారు. దాని ఫలితము కుమారుని మీద పడుతుంది ఇప్పుడు.

ఇక వైసీపీ తరపున, జగనన్న ఆశయాలు ను విలువ ల ను కాపాడాల్సిన బాధ్యత, వైసీపీ పెద్దలపై ఉంది. ఇప్పుడు అయినా, పర్చూరు లో మన అభ్యర్థి ఓడిపోయి, జగనన్న పరువు తీయాల్సిన అవసరం, అగత్యం ఏమి వచ్చింది, అని ఆలోచించారా? ఇది మన విఫల ప్రయత్నం కాదా?

దగ్గుబాటి గారిని తీసుకునేటప్పుడు, స్పష్టం గా హామీ ఎందుకు పొందలేదు? ఒక కుటుంబం ను, రాజకీయంగా చీల్చాము, అన్న అపవాదు మనకెందుకు? మోడీ సిద్ధాంతం నమ్మితే, దగ్గుబాటి గారి 3 సభ్యులతో మొత్తం అటు ఉండాలి. లేదా జగనన్న సిద్ధాంతం నమ్మితే, అందరూ ఇటు ఉండాలి. మనం చేసిన పొరపాటు, పర్చూరు ప్రజలు అసహ్యించుకున్నారు, ఛీత్కరించారు. తెదేపా ఏలూరి గారి గెలుపు నకు, ఇదొక కారణం కూడా.

ఇప్పుడు అయినా, కుటుంబ సభ్యులు ను కలిపి, ఒకవైపు ఉంచండి, జగనన్న ఆదర్శాలను గౌరవించండి అని పర్చూరు అభిమానుల ఆకాంక్ష.

ఇక రాజకీయాలను విరమిస్తాను అని, గత సంవత్సరము వార్తలు వచ్చాయి కాని, పూర్తిగా ప్రకటించలేదు అనుకుంట. ఇలాంటి పొరపాటు ఏ పార్టీ కూడా చేయరాదు, కుటుంబాలను తమ స్వార్ధము కోసము విడదీయరాదు, విడిపోవడానికి అంగీకరించ రాదు. దయచేసి, కుమారునికి నష్టము చేయవద్దు, తమ చేజేతులారా అని అభిమానుల ఆందోళన.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,895; 104 తత్వాలు (Tatvaalu) and views 226,212
Dt : 12-Aug-2020, Upd Dt : 12-Aug-2020, Category : Politics
Views : 955 ( + More Social Media views ), Id : 646 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bjp , ycp , leaders , mistake , daggubati , family
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content