బుద్ధ పూర్ణిమ - బుద్దం శరణం గచ్చామి - సిద్ధార్ధుడు బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,448; 104 తత్వాలు (Tatvaalu) and views 225,152.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బుద్ధ పూర్ణిమ ఈ సంవత్సరం మే 16 (భారతదేశం మరియు నేపాల్‌లో) లేదా మే 19 (ఆగ్నేయాసియా దేశాల వారికి)

చివరలో ఉత్త చేతులతో వేళతామని తెలిసినా, ఏమీ లేని మనము, ఎన్నో మోసాలు కుట్రలు ద్రోహాలు చేసి, పదవులు ఆస్తులు సంపాదిస్తుంటే, అన్ని ఉన్న రాజకుమారుడు, వాటిని వదలి, ఆనందము ను వెతుక్కుంటూ దేశాటనకు వెళ్ళాడు. చదవండి బుద్దుని కధలో భాగము.

పుత్ర జననవార్త విన్న శుద్దోధనుడు నగరమంతా ఉత్సవాలు జరిపించాడు. బంధుమిత్ర, పురోహితుల సమక్షంలో తన కుమారునకు సిద్ధార్ధుడు అని నామకరణం చేసాడు. మరల జ్యోతిష్కులు రావించబడ్డారు. సిద్దార్థుని జాతకచక్రం వారి ముందుంచి, జాతక వివరాలు చెప్పమన్నాడు శుద్దోధనుడు.

వారు జాతక చక్రాన్ని పరిశీలించి, మహారాజా మీ పుత్రుడు ఈ సమస్త భూమండలాన్ని శాసించగల సార్వభౌముడయినా అవుతాడు లేదా వైరాగ్యా భావనతో ఈ ప్రపంచాన్నే సన్యసించే, జ్ఞానాన్ని భోదించే సన్యాసి అవుతాడు, అని చెప్పారు.

వైరాగ్యం రాకుండా, అన్ని జాగ్రత్తలు పడ్డా కూడా, సమయం వచ్చింది.

మూడు అనుభవాలు :

వింతగా నగరాన్ని చూస్తూ వస్తున్నాడు సిద్ధార్ధుడు. మొదటగా అతనికి ఒక వృద్దుడు కర్రపట్టుకుని నడుస్తూ ఎదురైయ్యాడు.

వస్తున్న ఆ వింత ప్రాణి ఎవరు? అని అడిగాడు సిద్ధార్ధుడు. అతను మనలాంటి మనిషే, చెప్పాడు సారధి.
మనలా ఎందుకు లేడు? సిద్ధార్ధుడు అడిగాడు.
వృద్దాప్యం అతన్ని అలా చేసింది - సారధి జవాబు.
వృద్దాప్యం అంటే? సిద్ధార్ధుడు ప్రశ్న.

సారధికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. రథం ముందుకు సాగుతోంది. సిద్ధార్ధుని ఆలోచనారధమూ ముందుకు సాగుతోంది.

ఈసారి ఒక కుష్టు రోగి సిద్ధార్ధునికి ఎదురుపడ్డాడు.
అతను ఎందుకు అలా ఉన్నాడు? సిద్ధార్ధుని ప్రశ్న.
అతను కుష్టు రోగి, సారధి జవాబు.
కుష్టు రోగం అంటే?
పూర్వ జన్మ పాపఫలం ప్రభూ! అన్నాడు సారధి.
పూర్వ జన్మ పాపం అంటే?
ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. సారధికి, రధం ముందుకు సాగుతోంది. సిద్ధార్ధుని మనసులో సందేహాశ్వాలు పరుగులు తీస్తున్నాయి.

ఈ సారి సిద్ధార్ధునికి ఓ గృహస్తు ఇంటిముందు మృతకళేబరం, రోదిస్తున్న బందువులు కనిపించారు.

ఆ పడుకున్న మనిషి ఎవరు ? అతని చుట్టూ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు? అని అడిగాడు సిద్ధార్ధుడు.
ప్రభూ! ఆ మనిషి మరణించాడు. అందుకే అతని బందువులు ఏడుస్తున్నారు. జవాబు ఇచ్చాడు సారధి.
మరణం అంటే? తనకు తెలిసిన జ్ఞానంతో వివరించాడు సారధి. సిద్ధార్ధునుకి అవేమి రుచించలేదు.
ఇంకేమి చూడాల్సింది లేదు. రధాన్ని వెనక్కు మరల్చు అని ఆదేశించాడు సిద్ధార్ధుడు.

అంతర్మథనం :

నగరం నుంచి తిరిగి వచ్చిన తరువాత సిద్ధార్ధునిలో మేధోమథనం ప్రారంభమైనది. సమాధానాలు తెలియని ఎన్నో ప్రశ్నలు అతన్ని నిరంతరం వేధిస్తూనే ఉన్నాయి. మరణం అంటే ఏమిటి? మనిషికి ఎందుకీ కష్టాలు? దుఃఖ నివారణకు నిజమైన మార్గం ఏమిటి?
బందిఖానాలాంటి ఈ భవనంలో ఇంతకాలం గడిపిన జీవితం నిస్సారమని భావించాడు.

ఈ చెరనుంచి బయటపడాలని నిశ్చయించాడు. అడుగు ముందుకు వేశాడు. అప్పుడే పుట్టిన పసి బిడ్డ ఏడుపు వినిపించింది. యశోదర ప్రసవించిందని తెలుసు కున్నాడు. తన ప్రతిబింబాన్ని ఒకసారి చూడాలనే ఆశ అతని పితృ హృదయాన్ని ఊగిసలాడించింది. పురిటి గది వైపు రెండు అడుగులు వేసి ఆగిపోయాడు.

వద్దు. ఇది అశాశ్వత బంధం. నా అన్వేషణకు తగదీ బంధం. అని వెను తిరిగి రాజభవనం నుంచి రహస్యంగా బయటకు వచ్చాడు. అప్పటికే రథాన్ని సిద్ధంగా ఉంచాడు సారధి. సిద్ధార్ధ రధం ఎక్కాడు రధం కపిలవస్తునగర పరిసరారణ్యం చేరింది. సిద్ధార్ధుడు రధం దిగాడు. తన దుస్తులు,నగలు,సారధికి ఇచ్చాడు. కన్నీళ్ళతో చూసాడు సారధి.

వద్దు. ఈ కన్నీరుకు కారణం తెలుసుకోవాలనే నాయీ అన్వేషణ, అని ముందుకు నడిచాడు సిద్ధార్ధుడు.

అప్పుడు అతని వయసు 28 సంవత్సరములు ఆ రోజు ఆషాడ పౌర్ణమి, ఆదివారం,ఉత్తరాషాడ నక్షత్రం.

తపోదీక్ష :

సిద్ధార్ధుడు ఆ అరణ్యంలో ఓ ఏకాంత ప్రదేశంలో ఆహారం తీసుకోకుండా, కొంతకాలం తపస్సు చేశాడు. అతని సందేహాలకు సమాధానం దొరకలేదు. తిండి మానడంవల్ల తపస్సు సిద్ధించదు. బలమైన ఆహారం, బలమైన ఆలోచనలను పుట్టిస్తాయి. అవి అందుకు తగిన పరిశ్రమను చేయిస్తాయి, అని తలచి ఆ ప్రదేశాన్ని వదలి గయ చేరుకున్నాడు.

జ్ఞానోదయం :

గయ చేరుకున్న సిద్ధార్ధుడు నియమిత ఆహారం తీసుకుంటూ ఏడు సవత్సరాలు దీక్షగా తపస్సు చేశాడు. ఆ తపస్సు అతని జ్ఞాననేత్రాన్ని తెరచింది. సిద్ధార్ధునకు జ్ఞానోదయమైంది. అతని సందేహాలకు సమాధానాలు దొరికాయి. అతని అన్వేషణ ఫలించింది. సిద్ధార్ధుడు బుద్ధుడు అయ్యాడు. ఆ రోజు వైశాఖ పౌర్ణమి బుధవారం.

అష్టాంగ మార్గం :

మానవుని దుఃఖానికి కారణం కోరికలని, కోరికలను జయించితే ఆనందమని, ఈ ఆనందానికి అష్టాంగ మార్గమే రాజమార్గమని అందరికీ తెలియచేశాడు.

1 సమ్యక్ వచనము 2 సమ్యక్ జీవనము 3 సమ్యక్ సంకల్పము 4 సమ్యక్ వాక్కు 5 సమ్యక్ సిద్ధి 6 సమ్యక్ లోచన 7 సమ్యక్ సమాధి

ఇదే బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం. బుద్ధుడు తన తొలి ధార్మికోపన్యాసాన్ని, కుశనాగర లో ప్రారంభించాడు. అతని దివ్యోపన్యాసంలో ప్రధానంగా చోటుచేసుకున్న అంశం అహింస. అహింసా పరమోధర్మః.

ఇది బుద్ధుని సందేశం. అతని వాదనాపటిమకు ఎందరో ఆకర్షితులైయ్యారు. బుద్ధుని ధార్మిక జైత్రయాత్ర ఒక సంచలనాన్ని సృష్టించింది. తన కుమారుని వైరాగ్య విప్లవవిజయం విన్న శుద్దోధనుడు బుద్ధుని భిక్ష స్వీకరించటానికి రమ్మని ఆహ్వానించాడు.

భిక్ష స్వీకారం కోసం బుద్ధుడు రాజభవనంలో అడుగుపెట్టాడు.
- అది అతను పుట్టిపెరిగిన రాజప్రాసాదము.
- అది ఐహిక సుఖాలను అందించిన భోగభవనం.
ఇవేమీ అతనికి గుర్తురాలేదు. వైరాగ్య భావనతో భిక్ష స్వీకారానికి వచ్చిన భర్తను చూసింది యశోధర.

తొలిసారిగా తన కన్నతండ్రిని వింతగా చూస్తున్నాడు ఏడు సంవత్సరాల ప్రాయంగల రాహులుడు. బుద్ధుడు కూడా 7 సంవత్సరాల ఎడబాటు తర్వాత తన భార్య, బిడ్డలను చూశాడు. అది భౌతిక బంధాలకు లొంగని ఆధ్యాత్మిక చైతన్యం. యశోధర, రాహులుడు, బుద్ధుని పాదాలకు నమస్కరించారు. ఏ భావము లేకుండా వారిని దీవిన్చాడి బుద్ధుడు.

శుద్దోధనుడు కాషాయం కట్టిన తన కుమారుని వంక కన్నీళ్ళతో చూశాడు. చలించలేదు బుద్ధుడు. ఏ వైరాగ్యభావనతో రాజభవనంలో అడుగుపెట్టాడో, అదే వైరాగ్యభావనతో రాజభవనానిన్ని వదిలిపెట్టాడు.

Buddha Purnima - Buddham Sharanam Gachchami - Ashtanga margam by Siddhartha  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,448; 104 తత్వాలు (Tatvaalu) and views 225,152
Dt : 16-May-2022, Upd Dt : 16-May-2022, Category : General
Views : 627 ( + More Social Media views ), Id : 1393 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : buddha , purnima , buddham , sharanam , gachchami , ashtanga , margam , siddhartha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content