తల్లికి పుణ్యక్షేత్రాల ను చూపిస్తున్న తనయుడు - దేశ పర్యటనలో తల్లి కొడుకులు - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2302 General Articles and views 3,380,491; 104 తత్వాలు (Tatvaalu) and views 386,642.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నాకు తగ్గమనిషి ఇతను. వీరు మా ప్రతిబింబాలే. ఇలా, బయటకు రావాలి, చెప్పాలి ఇలాంటి విషయాలు. గొప్ప లు అనుకున్నా సరే, పది మందికి తెలియాలి. తల్లి దండ్రులను వదిలే వారికి కనువిప్పు కావాలి. ఇంకా మంచి చావలేదు అని తెలియాలి.

అతని పేరు దక్షిణమూర్తి కృష్ణకుమార్. కర్ణాటకలోని మైసూరుకు చెందిన కృష్ణకుమార్ (39) ఓ బ్యాంక్‌లో ఉద్యోగం. తల్లి, అతన్ని హంపీకి తీసుకెళ్లమని అడిగింది. అమ్మ కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యాడు.

కృష్ణకుమార్, తన 70 ఏళ్ల తల్లిని కేవలం హంపీకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రాలను తింపేందుకు సిద్దమయ్యాడు. యాత్ర చేపట్టేందుకు తన బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 

మైసూర్‌లో 2018 జనవరి 16న ఈ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌, కన్నడం వచ్చిన, కృష్ణకుమార్‌, తన తండ్రి పాత స్కూటర్‌ మీద యాత్ర చేపట్టారు.

తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, గోవా, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో, గడిచిన 15 నెలల్లో, దాదాపు 36 వేల కి.మీ దూరం ప్రయాణం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.3 లక్షలు ఖర్చు. మరో రెండు నెలల్లో మైసూర్‌కు చేరుకుని యాత్రకు ముగించనున్నట్లు తెలిపారు.

చాలా మంది తమ బుద్ది అనుసారం, తను ఒక్క డే నేమో అన్నారు. అంతే గానీ, మోహం లో పడకుండా ఉండాడు అని మెచ్చుకోలేరు. తాము మంచి పని చేయరు, ఇతరులు చేస్తే వంక పెడతారు. మరి, ఇంట్లో భార్య పిల్లలు ఉన్నవాళ్ళు , తల్లి దండ్రులను ఎందుకు ఉంచుకోవడము లేదు? భర్త ఉద్యోగానికి వెళ్ళినా, భార్య ఇంట్లో ఉంటుంది గదా, అత్త గారిని చూడటానికి.

తాతలు అనే వారు , గాడెద్దులా తిరుగుతున్నారు ముక్కు కు తాడు వేయాలి అంటారు. అంటే, చెడిపోతాడు, తాళి తో కట్టండి అని కాదా. అంటే ఒంటరి వారికి, చెడే అవకాశాలు 90 శాతం. మరి అతను గొప్ప కాదా, మంచి దోవలో వెళుతూ, ఇంకా బాధ్యత ఉంది అంటే.

తాళి కట్టాక, వదిలి వేసే వారు, ఇంకో పెళ్ళికి వెళ్ళే వారు, పక్క వెర్రి వేషాలు వేసే వారు, తమ వారిని రాచి రంపాన పెట్టేవారూ ఉన్నారు. వారైనా వీరైనా, 60 తర్వాత లేదా జబ్బు పేరెంట్స్ ను, చూసే వారు కృతజ్ఞత కలవారు, వారి పేరెంట్స్ గనుక చిన్నప్పటి నుంచి నేర్పి ఉంటే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,380,491; 104 తత్వాలు (Tatvaalu) and views 386,642
Dt : 25-Oct-2019, Upd Dt : 25-Oct-2019, Category : News
Views : 1413 ( + More Social Media views ), Id : 196 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Dakshinamurti Krishna Kumar , Mysore , Karnataka

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content