క్రిష్ణయ్య యాదవ సైన్యాన్ని ఇచ్చారు దుర్యోధనుడు కు, అలాగే ద్రోహులకు సహాయం చేస్తే? క్రిష్ణ మర్మం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,897; 104 తత్వాలు (Tatvaalu) and views 226,357.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Didn't Krishna give the Yadava army to Duryodhana, if we help the traitors as well? What is the secret of Krishna?

ఏవండీ, మీరు చెపుతున్న జీవిత సత్యాలు, మా అందరి జీవితాల్లో జరుగుతున్న నిత్య ప్రమాణాలు. అరిషడ్వర్గ అష్టవ్యసన దాసులకు, వెన్నుపోటు గుండెపోటు తప్పదు.

కానీ దుర్యోధనుడు దుష్టుడు అని తెలిసి కూడా, క్రిష్ణయ్య యాదవ సైన్యాన్ని ఇచ్చారు కదా, మేము అలాగే మాలాంటి కపట నటన 2 నాల్కల ద్రోహులకు సహాయం చేస్తే, అండగా ఉంటే తప్పేమిటీ అని జనాలు అంటే? క్రిష్ణ మర్మం ఏమిటి? మీరే బాగా చెపుతారు, 10 వ తరగతి వారికి కూడా అర్ధం అయ్యేలా.

అర్జునుడు తెలివిగా, క్రిష్ణ నువ్వు ఒక్కడివే చాలు మాకు అన్నారు. అమ్మ, మీకు మీ ఆలోచనలకు దూరంగా ఉండి, ఎన్నో కష్టాలు, అవమానాలు పడింది, అందరి చేతా. అలాగే, అమ్మ ఇప్పుడు, చాలా ముందు చూపుతో, గీత సారాంశముతో, మీరు ఒక్కరూ చాలు తోడు అని నిశ్చయం చేసుకున్నది.

వెంటనే అమ్మకు 10 ఏళ్ళ మనశ్శాంతి, పాద పూజ, ప్రపంచ అత్యుత్తమ వైద్యం, ఆయుర్వేదం, ఒక శారీరక మానసిక 24 గంటల నమ్మిన బంటు పాద సేవకుడు, అన్ని అమ్మకు అందాయి. అమ్మ, అర్జునుడు లా మనసా వాచా కర్మణా మిమ్మల్నే నమ్మింది. ఆమెకు 10 ఏళ్ళు మనశ్శాంతి ఆరోగ్యం. ఆదాయం అండ లేకపోయినా, అప్పు లేదు, తాకట్టు లేదు, చేయి చాచడం లేదు, తలవంచడం లేదు, సౌకర్యాలు అమ్మకు తగ్గలేదు, మేమే ప్రత్యక్ష్య సాక్ష్యం.

*జవాబు* - ధన్యవాదాలు గురువు గారు, మమ్మల్ని పొగిడే కన్నా తెగిడే కన్నా, మీ సాధన సాత్విక ఆచరణ సాక్ష్యాలు చూపితే, మీ కుటుంబానికి శ్రీరామ రక్ష. అమ్మ మన మీద ఆధారపడలేదు, మనమే అమ్మ పాదాలు చాలు అని, ప్రభుత్వ ఉద్యోగం ఇంకా అన్ని వదిలేసాము, గత 10 ఏళ్ళుగా. అమ్మ మనల్ని రక్షించింది, ఏలినాటి శని నుంచి.

శివయ్య ఇలాంటి తిక్క ఆలోచనలే చేసి, తన కొంపమీదకే తాను ఎన్నో సమస్యలు తెచ్చుకుని, మరలా విష్ణువు దగ్గరకు పార్వతి వెళ్ళి, అన్నా నువ్వే దిక్కు అంటే, నారాయణుడు కాపాడారు. ఎందుకంటే శివయ్య లో, స్వార్ధం లేని, ముందుచూపు లేని, భోళాశంకర అనే ఒక బలహీనత తప్ప, మిగతా విషయాలలో ఇద్దరూ ఒకటే. అడుసు తొక్కనేల కాలు కడగనేల?

సహాయానికి అర్హత, పాత్రత ఉండాలి. ధనం అధికారం బలగం ఉంది అని, అపాత్రా దానం అహంకారం మదం తో చేసిన, రేపు మనము కూడా రామన్న లాగా, రోడ్ మీద ఉండి ప్రాధేయపడాలి, ఎవరూ రారు. పులికి పాముకు, మనము సామాన్యులము మందు వేసి కట్టుకడితే, ఏమి జరుగుతుంది, ఇంటి ముందుకు వచ్చి ప్రాధేయపడ్డాయి అని?

కపట, నటన, 2 నాల్కల వారి మాటలు 75 శాతం మంది నమ్ముతారు, వారే మనకు రోగాలతో ఆసుపత్రులలో, పొలీసు స్టేషన్ లలో కోర్టులలో, జైళ్ళలో, ఇతర మత బాబాయి భక్తులుగా, పార్టీ/ సంఘ సభ్యులు గా, సొంత ముదుసలి తల్లి దండ్రులను వదిలేసిన వారిగా, తమ సొంత బిడ్డల దగ్గర దేవతలు గా ఉండలేము అనే వారిగా, తమ సొంత భాగస్వామి రోగం వస్తే ఆదాయం పోతే దేవతలు గా చూస్తారు అని చెప్పలేని వారిగా, మన చుట్టు బ్రమలు మోహాలలో ఉన్నారు. వారికి పతన భవిష్యత్ తెలుసు, కానీ మనల్ని పంచభుతాలు ఏమి చేయవు అనుకుంటారు.

మనము కేవలం సాక్షీభూతులము, అడిగిన వారికే సలహా ఇస్తాము, మనంతట మనం ఎవరి విషయాలలో జోక్యం చేసుకోము. ఎందుకంటే, బురదను విడవమెంటే, వరాహం వింటుందా, మనల్నే మీకు గర్వం అహంకారం మదం అని తిడుతుంది కానీ.

మన మనసు కు నచ్చింది కరెక్ట్ అనుకుంటే, ధర్మం లేకుండా, అది మన పతనమే, నేడో రేపో. దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని తాము చేస్తుంది కరెక్ట్ అనుకున్నారు. అందరూ పిల్లలతో సహా నాశనం అయ్యారు, వంశాలు తుడిచి పెట్టుకుని పోయాయి, యాదవ సామ్రాజ్యాలతో సహా.

ఇప్పుడు మన పిల్లలు కూడా, మన మూర్ఖత్వం నేర్చుకుని, వారు చేస్తుంది కరెక్ట్ అంటున్నారు. మనది మనకు కరెక్ట్ అయితే, పిల్లలు ది పిల్లల కు కరెక్ట్. ఇద్దరు లో లేనిది ఏది? ధర్మం. మరి ఇద్దరు లో ఉంది ఏమిటి? అవసరం అవకాశం కపటం నటన. వాటి ఫలితాలు పతనం, పంచభూతాల శిక్షణ, ఒంటరితనం, ఆశ్రమం, రోగాలు, అశాంతి.

ఎమ్మెల్యే ని చంపినప్పుడు, అందరూ అల్లుడు ను నిందిస్తే, మా అల్లుడు కడిగిన ముత్యం అన్నారు మామ, కపట నటనతో, నేను ఎవరికైనా సహాయం చేస్తాను ధర్మం తో పని లేకుండా అని. కొన్ని ఏళ్ళు తర్వాత అదే మామ ను అల్లుడు వెన్నుపోటు పొడిచిన, అదే మామ మరలా తప్పు తెలుసుకుని అల్లుడు ని నిందిస్తే, ప్రజలు మాత్రం అల్లుడు కడిగిన ముత్యం అన్నారు. అందుకే చెడపకురా చెడేవు, నువ్వు ఏది ఇస్తే, అదే వస్తుంది.

వెన్నుపోటు తో లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, మంచి లక్షణాలు ఉన్న వాళ్లకోసం వెంటపడండి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు. కానీ, మంచి లక్షణాలున్న వాళ్ళను కోల్పోతే, మన జీవితం పోయినట్లే, తిరిగి సంపాదించుకోలేం, నమ్మకస్తులు దొరకరు. అందరూ మనలాంటి కపట నటన దొంగలే జాగ్రత్తలు సుమీ.

మనం చేసిన గత లేదా ఈ జన్మ పాపాలకు, పంచభూతాల శిక్షణ కోసం పాప ప్రక్షాళన కోసం, ఈ జన్మ/ దశ లో భాగస్వామి గానో, పిల్లలు గానో వారి భాగస్వామి గానో, మిత్రులు బంధువులు గా, ఏదో ఒక రకంగా మనకు బుద్ధి చెప్పి, మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేపిస్తారు. అందుకే ముందుగా నే మనల్ని మనం తెలుసుకుందాం.

మన మిత్రులు బంధువులకు కూడా చెప్పినాము, మీ పిల్లలు ఎక్కడకో పొయ్యి, కష్టపడనవసరము లేదు మోసపోనవసరము లేదు, అవన్నీ దేవుని దయవలన మనమే ఇద్దాము, కానీ మీరు మన పిల్లలు గుణవంతులు, మానసిక బలవంతులు, క్రుతజ్ఞత విశ్వసనీయత గలవారు, స్తిర బుద్ది గల వారు, అని సాక్ష్యాలు నిరంతరం ఇస్తూ ఉండండి.

మన పిల్లల మంచి గుణాలను, మనము చెపితే తప్పు లేదు కదా? మనల్ని నమ్మి ధర్మ దోవలో ఉన్నవారికి, ఏనాటికీ మానసిక బలహీనత రాదు. నమ్మినవారు, ప్రతి వారం చెపుతున్నారు, నమ్మని వారు, నవ్వుతూ గేళి చేస్తున్నారు. ఆ తర్వాత వారి పిల్లలు/ భాగస్వామి, వారినే గేళిచేస్తున్నారు ఇప్పుడు.

ఎన్నోసార్లు చెప్పాము మంచి. వారు మీకు చెప్పకుండా, ఏదీ చేయము. ధర్మం దోవ లోనే వెళతాము అన్నారు. ఏ విషయంలో కూడా, మాట పై నిలబడలేదు. దాని వలన మనకు నష్టం లేదు. రేపు వాళ్ళే, ఆ అధర్మం ఫలితాలు భరించలేరు, ఒంటరిగా, నిస్సహాయత తో అనేదే బాధ. అందుకే ఇన్ని మాటలు జాగ్రత్తలు. రామన్న రోడ్డు ఎక్కి వేడుకుంటే, ఒక్కరు వచ్చారా? మన ముత్యాల భవిష్యత్తు, మనకు కనపడుతుంది కదా.

ఇంక అసలు కధకు వద్దాము. క్రిషయ్య సంకల్పం, పాప నాశనం. కపట నటన 2 నాల్కల అధర్మ పరులు అందరూ, భారత యుద్దం లో గతించాలి. కానీ ముందు మంచి చెప్పాలి అని, తెలిసి రాయబారానికి వెళ్ళారు, చెప్పారు, వాళ్ళు తిట్టారు. ఇప్పుడు మనల్ని కూడా 75 మంది తిడుతున్నారు.

క్రిష్ణుని సలహాలతో, ఎదిగిన యాదవ రాజ్యం లో కూడా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం పెరిగి, ఇదంతా మా భుజ బలం వలనే, అని తాగి తందనాలు ఆడుతున్నారు, విచ్చల విడిగా పొర్లుతున్నారు. తాను చెప్పినా వారు వినరు, తనూ స్వయముగా చంపకూడదు. కాబట్టి అలా విభజించారు.

యాదవ సైన్య వీరులు, ఇది విని ఏమనాలి? అదేమిటి క్రిష్ణా, మీకు వ్యతిరేకముగా మేము యుద్దమా? చేయలేము ఇది ధర్మ విరుద్దం, మన్నించాలి అనాలి. అంత ఇంగితము ఎప్పుడో పొయింది. వారు ఏమి అనుకుటున్నారు, మేము బలాడ్యులము కాబట్టి, ధన పేరాసలో ముదుసలి అమ్మా నాన్న అత్త మామకు ద్రోహం చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు విదేశాలు పోయినట్టుగా, కౌరవ అధినేత మమ్మల్ని సహాయము గా కోరి తీసుకుని వెళుతున్నారు అని అహంకరించారు/ అంగీకరించారు. పతనం అయ్యారు. మిగతావారు, యాదవ వీరులు/ జనాలు, ముసలముతో పతనం అయ్యారు. ఇది క్రిష్ణ సంకలము మాత్రమే, పాప ప్రక్షాలనకు.

కాబట్టి, మనము చెడుకు అండగా ఉంటే, ఆ చెడుకే మనము బలి అవుతాము. ఇదే మామ వెన్నుపోటు, బాబాయి గుండె పోటుగా, ఇప్పుడు జనాల అందరికీ తెలుసు. ఆ మాయలో పడవద్దు, మనల్ని మనం తెలుసుకుని, మన కుటుంబాలను, మన పిల్లలను, మన వంశాలను, మనుమలను, కాపాడుకుందాము, మాయకు బయట ఉండే మానసిక బలము తో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,897; 104 తత్వాలు (Tatvaalu) and views 226,357
Dt : 19-Feb-2024, Upd Dt : 19-Feb-2024, Category : General
Views : 147 ( + More Social Media views ), Id : 2026 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Krishna , Yadava , army , Duryodhana , help , traitors , secret
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content