Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఈటెల గెలుపు, కేసీయార్ కి పెద్ద తలనొప్పి అయ్యింది. అదే మనకు గుణపాఠం
* 151 స్థానాలు కొత్తవారైన మనమీద నమ్మకం తో కాదు, చంద్రన్న మీద
* అమరావతి రైతుల పాదయాత్ర - న్యాయస్థానం టూ దేవస్థానం - శభాష్ సాధించారు అనుమతి, విజయీభవ.
* పెట్రోలు ధర తగ్గించమంటే, అర్ధం లేని వ్రుధా భారీ పేపర్ ప్రకటన - ఆడలేక మద్దెల ఓడు
2 min read time. మనము గతములో కూడా ఒక కధనము రాశాము. ఏమీ మారలేదు, కాగితము ప్రకటనలు తప్ప, బాపట్ల మెడికల్ కాలేజ్, ఒంగొలు హర్బర్ పోర్ట్ గురించి అభివ్రుద్ది ఫోటోలు ఉంటే, చూప గలరు.
link.
ఇది కేవలం మా 4 పిల్లల (బీజేపీ, తెదేపా, వైకాపా, జనసేన) భవిష్యత్ సరిచేయడానికి మాత్రమే. తప్పు ఏనాటికీ నాయకులది అధికారులది కాదు, వారిని మత్తులో ఎన్నుకున్న నీతి లేని వోటర్లదే, అంటే మనదే తప్పు అని మాత్రం మరువద్దు, మరలా మేము చెప్పకపోయినా.
ఈ రాష్ట్రం అప్పులతో దివాలా తీయడానికి, అధోపతనానికి, మొదటి కారకుడు, అమ్ముడుబోయే ఓటరు అలాగే ఓటు వేయకుండా నిదరబోయే ఓటరు, అంటే మనము.
ఈటెల గెలుపు, కేసీయార్ కి పెద్ద తలనొప్పి అయ్యింది. అదే మనకు గుణపాఠం, ముందస్తు హెచ్చరిక కూడా అనుకోవాలి. ఆట పూర్తిగా తమ చేతిలో నుంచి జారిపోతుందేమో అని భయంతో, ఈ రోజు కేసీయార్ ప్రెస్స్ మీట్ లో ఎదేదొ డిల్లీ గురించి మన గల్లీలో అనేసారు.
తగ్గట్టు గానే కరెక్ట్ మొగుడు బండి సంజయ్, తిరుగు జవాబు ఇచ్చారు. ఆ ధైర్యం పట్టు గొంతు, ఆంధ్రా బీజేపీ నాయకులకు రాదు, వారిదగ్గర ట్రైనింగ్ తీసుకోమని మనము 2 ఏళ్ళ ముదే చెప్పినాము, వారు మారరు.
మరలా డిల్లీ కేసీయార్ వెలితే, చప్పుడు చేయకుండా బుద్దిగా మంచి బాలుడు లా తల వంచుకుని వచ్చేస్తారు. మన జగనన్న గట్టిగా డిల్లీ ని అనేది లేదు మనం వినేదీ లేదు, ఎప్పుడూ సైలెంట్ నే, ఇదే బెట్టర్ కదా. కేసీయార్ చంద్రన్న లాగా, తలేత్తి, మరలా తల దించడం ఎందుకు.
జగనన్న సలహాదారులు, ఆయన విశ్వసనీయత తగ్గిస్తూ, మాట మడమ ను వీలైనన్న సార్లు తిప్పతూ, ఎంత కిందకు జార్చాలో అంత జారుస్తున్నారు. సేం టు సేం, గత ప్రభుత్వములో, చంద్రన్న ను దిగజార్చినట్లు.
ధీరుడు పోరాట వీరుడు ప్రత్యేక హోదా తెస్తారు అంటే, తుస్సు మని, మన అవసరము మోదీ కి లేదు అన్నారు. ప్రభుత్వములో ధనము ఉందో లేదో తెలీదు, కొత్త జిల్లాలు జనవరి నుంచి అన్నారు, ఎవరూ మరలా నోరు ఎత్తడం లేదు. 3 రాజధానులు ఎప్పుడు సాకారం అవుతుందో, జగనన్న కు కూడా తెలీదు.
అమరావతిలో మొదటి కూల్చుడుకి, ప్రతిగా, ఇంకోటి కొత్తది కట్టారా లేక రాజధాని కొత్త కట్టడాలు ఎక్కడైనా లెగుస్తున్నాయా తెలీదు. అంతా జగన్నాటకం, అయోమయం జగన్నాధం లాగా ఉంది అని అభిమానులు మింగలేక కక్కలేక ఆపసోపాలు పడుతున్నారు.
పాదయాత్ర తో జనాలను ఒకనాడు బుగ్గలు పట్టుకుని కలసి, 3 ఏళ్ళు అవుతున్నా, మరలా ప్రతి నియోజక వర్గ ఎమ్మెల్యేను ఎంపీలను జనాలను కలసి, పార్టీ ఎలా ఉంది, అభివ్రుద్ది ఉందా, అని అడిగినట్లు ఎక్కడా కనపడలేదు. కోట లో రాజకుమారుడి లా చాటుగా కూర్చుంటే, జనముతో తిరగక ఎమ్మెల్యేలతో కలవక, ఇంకో సారి మనల్ని ఇదే మెజారిటీతో నమ్మి గెలిపిస్తారా?
స్థానిక సంస్థలు గెలవడం వేరు, జెనరల్ ఎలెక్షన్ గెలవడం వేరు. అప్పులలో విపరీతమైన అభివ్రుద్ది తప్ప, ఏదో కొంత మందికి పంచుడు తప్ప, ఏమీ మార్పు లేదు. జనం మనిషి రాజన్న పాలనకు, గెలిచిన తర్వాత దూరంగా ఉండే జగనన్న పాలనకు 50 శాతం పోలిక కూడా లేదు. ఆఖరుకు ఎన్నికలకు కూడా, నేను రాను, మీరే గెలిపించండి అని లోనే ఉన్నారు.
151 స్థానాలు మనకు వచ్చింది, కొత్తవారైన మనమీద నమ్మకం తో కాదు, చంద్రన్న మీద అసహ్యము తో అని మరువద్దు.
*1.
అమరావతి రైతుల పాదయాత్ర - న్యాయస్థానం టూ దేవస్థానం - శభాష్ సాధించారు అనుమతి, విజయీభవ.*
ఒకనాడు, జగన్న రాష్ట్రమంతా పాదయాత్ర చేసారు, చంద్రన్న పాలనలో. మరి ఇప్పుడు ఎందుకు, ప్రతి దానికీ భయపడుతూ, వాద్దు వద్దు అంటూ అడ్డుపెడుతున్నారో, అభిమానులకు అర్ధము కావడం లేదు. తన అభివ్రుద్ది మీద నమ్మకము లేకనా?
చంద్రన్న బినామీల భూములు కధ వేరు. అది ఇంకా మనము నిరూపించలేదు, మన దాంట్లో ను బినామీల రాజ్యం నడుస్తుంది, అని అభిమానులు వాపోతున్నారు.
వారు కాకుండా, నష్టపోయిన సామాన్య రైతులు కూడా ఉన్నారు. తప్పు ఏముంది, వారు పాద యాత్ర చేసుకుని, తమ బాధ వెల్లబోసుకుంటే. నిన్న, మా చీరాల డీయెస్పీ కూడా, నోటీసు ఇచ్చారు. అడుగడుగునా, అడ్డుపడుతున్నారు. ప్రజలలో, మీరే, సానుభూతి పెంచుతున్నారు.
వారిని గమ్ముగా పాదయాత్ర చేసుకోమని, వదిలేయాలి. మీకు చేతనైతే, 3 రాజధానులకు అనుకూలముగా అలాగే పచ్చని 3 పంటల మాగాణి కాంక్రీటు చేసినన్దుకు నిరశనగా, పాదయాత్ర చేపట్టండి. పేపరులో 2 వార్తలు వస్తాయి. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు, ఏది నిజమో అబద్దమో.
*2.
పెట్రోలు ధర తగ్గించమంటే, అర్ధం లేని వ్రుధా భారీ పేపర్ ప్రకటన - ఆడలేక మద్దెల ఓడు*
ఏమయ్యా ప్రపంచములో దొరకని, కొత్త బ్రాండ్ లిక్కర్ ధర, భారీగా ఎందుకు పెంచారు అంటే, జనము తాగడము తగ్గాలని, మనము తెలివిగా జవాబు ఇచ్చాము. మరి ఇప్పుడు, కేంద్రం మీద, మీరు ఎంతో పెంచారు, 5 రూపాయలే తగ్గించారు ఎన్నికల కోసం అని, మనము ఆవేశపడటము బాగోలేదు.
జనము కూడా పెట్రోలు తక్కువ వాడాలని, అనవసరముగా రోడ్ల మీద తిరగకూడదని, రేటు పెంచాము అంటారు వారు కూడా. మనము ఒప్పుకోవాలి కదా?
నిన్నటి మన భారీ ప్రకటన జనము పట్టించుకుంటారా, అర్ధము అవుతుందా? వారికి అది అవసరమా?
నవరత్నాలు, ఎవరి జేబులో డబ్బుతో అమలు చేస్తున్నారు, మీ పేర్లు పెట్టుకుని అని జనము అడుగుతారా? వారికి కావాల్సినది ఉచిత పధకము అంతే, ఆదాయం ఎక్కడిది అని వారు అడగరు, అడిగితే మనము గెలవము.
ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఎంతో కొంత తగ్గించాయి. పోనీ కేంద్రం 5 తగ్గించింది అనుకుందాము, చాలా పెంచి.
మనము ఇన్ని ఉచిత పధకాలు, రాజన్న జగనన్న పేర్ల పధకాలతో, మన సొంత ధనముతో ఇవ్వంగలేనిది, జగనన్న పెట్రోల్ ధర సహాయ పధకము అని కొత్తది పెట్టి, 20 రూపాయలు లీటరుకు తగ్గించి, రాష్ట్రం మొత్తము అందరికీ బహుమతి ఇద్దాము.
కేంద్రము కన్నా, మనమే గొప్ప అందాము. మన ఎమ్మెల్యేలు ఎంపీలు, వారి గనుల మరియు మద్యం చాటు ఆదాయము నించి, భాగము అడిగి తీసుకుని, ప్రజలకు మేలు చేద్దాము.
ఎంపీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో రోజుకి ఒక ఫోటో లేని అలాగే స్థానికము గా ఉండని, నాయకుల దగ్గర నుంచి, ప్రభుత్వ సహాయనిధికి ధనం అడుగుదాం. డాబాలు ఉన్న కబ్జా షాపుల నుంచి పన్నులు అడుగుదాము.
లేదంటే, 20 తగ్గిస్తే, జీతాలు ఇవ్వలేము, నవరత్నాలు నడపలేము, అని నిజాయితీగా జనానికి చెపుదాము.
రాజన్న తెలివితేటలు, జనరంజన పరిపాలన ఎక్కడ కూడా కనపడటం లేదు అని అభిమానులు బాధపడుతున్నారు. పన్ను పోటు తప్ప, సంతోషము లేదు అని నిరుత్సాహ పడుతున్నారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1795 General Articles and views 1,386,707; 93 తత్వాలు (Tatvaalu) and views 184,202 Dt : 07-Nov-2021, Upd Dt : 07-Nov-2021, Category : Politics
Views : 544
( + More Social Media views ), Id : 1272 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
govt ,
jagananna ,
advisers ,
credibility ,
twisting ,
turning ,
heel ,
chandranna ,
petrol ,
amravati ,
farmers Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments