చంద్రన్న పచ్చని పొలాలకు చేసింది న్యాయమా? మరి జగనన్న సరి చేస్తారా కొనసాగిస్తారా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1766 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,068; 94 తత్వాలు (Tatvaalu) and views 184,764.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చంద్రన్న రైతన్నల పచ్చని పంట పొలాలకు చేసింది న్యాయమా లేక అన్యాయమా? మరి జగనన్న ఆ తప్పుని సరి చేస్తారా? కొనసాగిస్తారా? అవి వెనక్కి ఇచ్చి పంటలు మరలా పండించుకోమని, చంద్రన్న ను కాపాడతారా, ఆయన పాప శాతము తగ్గిస్తారా? లేక అదే తప్పు వైజాగ్ లో తిరిగి తనూ చేస్తారా?

మన రామన్న సినిమా అన్నా, రాజన్న తేట నవ్వు అన్నా, ఎంతో గౌరవము మరియు అభిమానము. వారి పిల్లలు బంధువులు అన్నా కూడా, అదే ఉంటుంది కదా. మనము వారు ఇరువురి కన్నా, ప్రత్యమ్నాయమునకు అవకాశము ఇవ్వడము లేదు కదా.

జగనన్న వర్గము - చంద్రన్న మామకు వెన్ను పోటు పొడిచిన పాపము వదలదు, నేటి చంద్రన్న అస్సెంబ్లీ లో దుస్తితి చూసి, పైనుండి రామన్న చూసి ఆనందిస్తున్నారు అని అంటారు.

సరే, నిజమేది అయినా, రామన్న కు వెన్ను పోటు ఇబ్బంది లేకుండా, సరి చేసి ఉండవచ్చు ఆనాడు, సరిగ్గా ఆలోచన చేస్తే, అప్పుడు పెద్దలు. జరిగిపోయింది, ఇప్పుడు మార్చలేము. కానీ ఆ మచ్చ వెంటాడుతూనే ఉంది, ప్రతి అస్సెంబ్లీ సమావేశములో.

ఆఖరుకు శాసన మండలి(పెద్దల సభ) రద్దు అయే ప్రమాదము కూడా ఉంది, దానికీ చంద్రన్నే మూల కారణము అవుతున్నారు కదా. ఎం ల్ ఏ లు, ఎం ఎల్ సీ లు, రాజ్య సభ సభులు ఆయనను వదిలి వెళుతున్నారు. లేదు ఆయన పంపినా, నా తల్లి దండ్రులు భార్య పిల్లలు పక్కింట్లో ఆనందము గా ఉన్నారు, నాకు రక్షణ గా అని చెప్ప గలమా? ఒక తప్పుకు ఎన్ని వరుస తప్పులు అనర్ధాలు. కర్మ వెంటపడుతుందా?

ఇప్పుడు కొత్తగా, రాజధాని కోసము రైతుల ధర్నాలతో, పొలాల పైన తిరిగి చర్చ లు ధర్నాలు జరుగుతున్నాయి. మరలా ఆ విషయము మొదటికి వచ్చింది. స్థలాలు పొలాలు వెనక్కి ఇద్దాము అంటున్నారు.

ఒక రాజధానా లేక మూడు రాజధానులా అని? రైతులు నష్టపొతున్నారు అని ధర్నాలు జరుగుతున్నాయి. చంద్రన్న కుటుంబము కూడా జోలే పట్టి, చందాలు పడుతున్నారు.

రైతుల నష్టము అంటే? ధన పరముగా నా? లేక తిండి గింజల పరము గానా? మా భూముల విలువ పోతుంది, త్యాగాలకు అర్ధము లేకుండా పోతుంది అని కొందరు అంటున్నారు. మిగతా సగము మంది రైతులు, గమ్ముగా ఉంటున్నారు, పొలాలు ఇచ్చి అన్నానికి ద్రొహము చేసామనో.

మూడు పంటలు పండే పొలాలకు నష్టము చేసింది ఎవరు? చంద్రన్నా లేక రైతులా? ఎందుకంటే, అప్పుడు జగనన్న, అక్కడ వద్దు పొలాలను పాడు చేయవద్దు అని మొత్తుకున్నారు. అది రాజకీయమైనా, పండే నేలను బీడు పెట్టడము పాపము.

ఇంకో చోటనో పొలాలు పాడు చేయకుండా లేదా దొనకొండో, పెట్టమన్నారు. కొంతమంది రైతులు ధర్నాలు చేసారు, మొత్తుకున్నారు, అప్పుడు ఎవ్వరూ వారి గోడు వినలేదు. ఇవ్వని వారివి, లాక్కున్నట్లు ఉన్నారు.

చంద్రన్న విన్నారా ఆనాడు? జగనన్న చెప్పే, రాజకీయ ఆరోపణలు ఇన్సైడ్ ట్రేడింగ్ 4000 ఎకరాలు గురించి పక్కన పెడితే, పొలాలను స్వచ్చముగా, రైతులే ఇచ్చారు అని చంద్రన్న చెప్పారు.

ఇప్పుడు చెప్పండి, మనకు అన్నము పెట్టే పొలాన్ని అసలు రైతులు అలా ఇవ్వొచ్చా? లాక్కుంటే ప్రభుత్వానిది పాపము, రైతుది తప్పు లేదు. అదే మనము డబ్బు కోసము ఇస్తే? అది నీతి ధర్మము ఏనా? అక్కడే ఎందుకు పెట్టాలి, అన్నపూర్ణ లాంటి పొలాలను పాడుచేసి?

ఆ పాపము ఎవరిది? రైతుదా, చంద్రన్నదా? రాజధాని ఎక్కడైన పెట్ట వచ్చు, ఒక బీడు భూమిని మరలా సాగు భూమిగా చేయాలి అంటే, ఎంత కష్టము? నోటికాడ అన్నము దూరము చేసినట్లు కాదా?

అటవీ భూమిని వాడుకోవాలంటే ప్రభుత్వము, రాజధాని లేదా ఇంకో ప్రజా అవసరాల కోసము, దానికి సమానమైన భూమిని ఇచ్చి, అందులో మొక్కలు నాటాలి అనే పద్దతి ఉంది అనుకుంట. కానీ పచ్చని పంట పొలాల విషయములో అలాంటి నియమాలు లేవా?

వెనకటికి ఒక సినిమాలో, ఒకామే (చంద్రన్న) వేరొక ఆమె భర్తను (పొలాన్ని) కోటి పోసి కొంటుంది. భార్య (రైతు) అమ్మితేనే నేను కొన్నాను అంటుంది. ఆమె సంతోషము కోసము భర్తను ఇచ్చి, నా సంతోషము కోసము ధనము తీసుకున్నా అంటుంది భార్య. డబ్బో ఫ్లాటో ఆస్తో ప్రతిఫలము గా తీసుకుని, భర్తను ఇవ్వడము, త్యాగము కిందకు వస్తుందా?

శాస్త్ర ప్రకారము చూస్తే, ఇద్దరిదీ తప్పే, ఎందుకంటే, పవిత్రమైన మాంగల్యాన్ని ధర్మాన్ని అపహాస్యము చేసారు, కానీ తమ పనులను సమర్ధించుకున్నారు. వారు సమర్ధించుకున్నంత మాత్రాన అది పుణ్యకార్యము అవుతుందా? దానికి మనో వ్యధ చెల్లించ వద్దా?

అలాగే, ఉన్న మచ్చలు గాక, కొత్తగా ఈ మచ్చ ఎందుకు మన చంద్రన్నకు. ఆయన పక్కన ఉన్న పెద్ద మనుషులు, వద్దు, భూమి కూడా పగబడుతుంది, మన మీద అని నచ్చచెప్పలేక పోయారు. ఎవరి స్వార్ధము వారిది, కానీ మచ్చ మోయాల్సింది మన చంద్రన్నే.

ఒకవేళ అమరావతే రాజధాని అయినా కూడా, ఆ పొలాలు ఇక పంటగా వాడకపోతే, మన చంద్రన్నకు అదొక మచ్చగా మిగిలిపోతుంది.

ఇదే పని, అంటే వైజాగ్ దగ్గర పొలాలను కూడా ఇలాగే చేస్తే, జగనన్న కు కూడా ఆ పాపము మచ్చ అంటుకుంటాయి. దోందూ దొందే అవుతాయి, ఫలితము తప్పదు జీవితములో వాటికి. చంద్రన్న ఇప్పుడే, దాని ఫలితము చవి చూస్తున్నారు. ఎవరైనా వారికి నచ్చచెప్పగలరా? ఆ మచ్చ పాపము, వారి ఇరువురిని అంటకుండా మనము కాపాడగలమా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,068; 94 తత్వాలు (Tatvaalu) and views 184,764
Dt : 26-Jan-2020, Upd Dt : 26-Jan-2020, Category : Politics
Views : 866 ( + More Social Media views ), Id : 294 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , chandra babu , amaravati , farmer lands
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content