1.
పవన్ కళ్యాణ్ చెప్పిన 'కుంకీ ఏనుగుల' గురించి తెలుసా.. రైతుల కోసం ఐడియా అదిరింది - 2024-07-27T10:52:57+05:30
Pawan Kalyan Request On Kumki Elephants: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్న విషయం ప్రస్తావనకు రాగా.. ఈ క్రమంలో అప్పుడే కుంకీ ఏనుగుల గురించి చర్చ జరిగింది. అయితే కర్ణాటక నుంచి వీటిని తీసుకోవడానికి స్వయంగా తానే అక్కడి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తానన్నారు.
ఇంకా
2.
ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన - 2024-07-27T10:01:51+05:30
Ntr Bharosa Pension Scheme Distribution: ఏపీలో ఆగస్టు 1న పింఛనల్ పంపిణీ చేయనున్నారు.. అయితే సెర్ప్ సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. నిధులు జమ, విత్ డ్రా, పంపిణీ వరకు ఉద్యోగులు సూచనల్ని పాటించాలన్నారు. పింఛన్ల పంపిణీ, సచివాలయాల ఉద్యోగులకు మ్యాపింగ్పై కూడా సెర్ప్ సీఈవో కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంకా
3.
వచ్చే నెల ఉక్రెయిన్కు మోదీ.. రష్యా దండయాత్ర తర్వాత తొలిసారి - 2024-07-27T10:50:05+05:30
ఉక్రెయిన్, రష్యా మధ్య రెండేళ్లకుపైగా సాగుతోన్న యుద్ధంలో వేలాది మంది సైనికులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది నిరాశ్రయులుగా మారిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి ఐరోపా శరణార్ధుల సమస్యను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జులై మొదటి వారంలో రష్యా, ఆస్ట్రియా పర్యటనలకు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్ను ఆయన ఆలింగనం చేసుకోగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇంకా
4.
ఏపీలో స్కూాల్ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది, కీలక ప్రకటన - 2024-07-27T08:55:49+05:30
Nara LokesH On Vidya Kanuka Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యా కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని.. టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. అంతేకాదు విద్యాకానుక కింద ఇచ్చే బ్యాగ్ల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు మంత్రి లోకేష్
ఇంకా
5.
ఆ రాష్ట్రానికి వెళ్లే టూరిస్ట్లు.. డస్ట్బిన్ వెంట తీసుకెళ్లాల్సిందే.. కీలక ఆదేశాలు! - 2024-07-27T09:05:55+05:30
పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ, ఈ విషయంలో ప్రజలు బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటారు. ఎక్కడక్కడ చెత్తను వేస్తూ తమకేం పట్టన్నట్టు ఉంటారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. తక్కువ ఉపయోగం , అధిక చెత్త వేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను కేంద్రం రెండేళ్ల కిందటే నిషేధించింది.
ఇంకా
6.
Khammam: తడి చేతులతో మొబైల్ ఛార్జింగ్ పెట్టిన చిన్నారి.. ఎంత ఘోరం జరిగిపోయింది - 2024-07-27T09:58:57+05:30
ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన తండ్రి మొబైల్ ఫోన్ను తీసుకుని.. ఛార్జింగ్ పెట్టేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో చేతులు తడిగా ఉంటే ప్రమాదమని అవగాహన లేని ఆ చిన్నారి.. చివరకు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఛార్జింగ్ పెట్టగానే ఆమె షాక్తో గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు. అనంతరం ప్రథమ చికిత్స చేసినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇంకా
7.
మంత్రి లోకేష్తో వైసీపీ మహిళా ఎమ్మెల్సీ భేటీ.. జగన్ సొంత జిల్లా, త్వరలో టీడీపీలోకి! - 2024-07-27T08:27:29+05:30
Zakia Khanam Meet Nara Lokesh: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. తాజాగా కీలక పరిణామం జరిగింది. వైఎస్సార్సీపీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మంత్రి లోకేష్ను కలిశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానమ్ లోకేష్తో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో లోకేష్ను శాలువాతో సత్కరించారు. జకియా ఇటీవలే మంత్రి ఫరూఖ్న కూాడా కలిశారు.. తాజాగా లోకేష్తో భేటీకావడంతో.. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంకా
8.
అమృత ప్రణయ్ బిగ్ బాస్లోకి వెళ్తే జరిగే పరిణామాలివే.. కాచుకుని కూర్చున్నారు కాకులు - 2024-07-26T18:49:51+05:30
Bigg Boss 8 Telugu Contestants List: బిగ్ బాస్ క్రీడ ఎంత రాక్షసత్వంగా మారిందో గత సీజన్లో చూశాం. తనకి పోటీగా ఉన్నాడని అక్కసుతో తన పోటీ ఇచ్చేవాడితో పాటు.. అతని తల్లిని, భార్యని పచ్చి బూతులు తిడుతూ తరిమితిమిరి కొట్టి రాక్షస ఆనందం పొందిన సైకో చేష్టల్ని చూశాం. గతంలో ఎన్నడూ లేనంతగా.. బిగ్ బాస్లో గెలవడానికి ఇంత నీఛమైన పనులకు పాల్పడతారా? జనాల్ని ఇంత దారుణంగా నమ్మించి మోసం చేస్తారా? అనేట్టు చేశారు. ఇప్పుడు మళ్లీ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది.
ఇంకా
9.
Paris Olympics 2024: పారిస్ సంబరం.. ఘనంగా ఆరంభం.. - 2024-07-27T09:05:11+05:30
పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. తొలిసారి స్టేడియంలో కాకుండా పారిస్ నగరంలో సెన నదిపై ఈ వేడుకలు నిర్వహించారు. కళ్లు జిగేల్ మనే విద్యుత్ ధగధగలు, విన్యాసాలను సాంస్కృతి కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. 6 కిలో మీటర్ల మేర 85 పడవలపై ఈ పరేడ్ జరిగింది. సుమారు 205 దేశాలకు చెందిన 6800 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. సుమారు 3.20 లక్షల మంది ప్రేక్షకులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూశారు. పీవీ సింధు, శరత్ కమల్లు భారత పతాకదారులుగా వ్యవహరించారు.
ఇంకా