1.
విరాట్ కోహ్లి టు రోహిత్ శర్మ.. 2025లో వన్డేల్లో దుమ్మురేపిన ప్లేయర్లు వీళ్లే! - 2025-12-25T14:17:41+05:30
2025లో భారత వన్డే క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 11 విజయాలు నమోదు చేసింది టీమిండియా. ఈ ఏడాది టాప్-5 వన్డే పెర్ఫార్మర్లలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 651 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. విరాట్ కన్నా కేవలం ఒక్క పరుగు తక్కువగా.. 650 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ కూడా రాణించారు.
ఇంకా
2.
ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు.. రూ.5 లకే మంచి భోజనం.. మెనూ ఏంటంటే? - 2025-12-25T14:21:55+05:30
ఢిల్లీలో పేదల కోసం బీజేపీ ప్రభుత్వం అమ్మ, అన్న తరహాలో అటల్ క్యాంటీన్లను తాజాగా ప్రారంభించింది. ఇందులో కేవలం 5 రూపాయలకే రుచికరమైన శాకాహార భోజనం అందజేయనున్నారు. మొదట 45 క్యాంటీన్లు, త్వరలో మరో 55 క్యాంటీన్లు సహా 100 అందుబాటులోకి రానున్నాయి. కూలీలు, అల్పాదాయ వర్గాలకు గౌరవప్రదమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక, ఈ క్యాంటీన్లకు ఆద్యురాలు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె దేశంలోనే తొలిసారి పేదల కోసం క్యాంటీన్లు ప్రారంభించారు.
ఇంకా
3.
'దండోరా' మూవీ రివ్యూ: ‘విజయ’వంతంగా శివాజీ అంతిమయాత్ర.. మంగపతి 2.0 - 2025-12-24T18:16:44+05:30
Sivaji Dhandoraa Review: గత రెండురోజులుగా హీరో శివాజీ పేరు మారుమోగిపోతుంది. మహిళల వస్త్రధారణ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో దుమారం రేగింది. అయితే ఆయన ఏ సినిమా ఫంక్షన్లో అయితే ఆ వ్యాఖ్యలు చేశారో.. అదే సినిమా థియేటర్స్లో డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. అదే దండోరా. ఈ సినిమాపై నమ్మకంతో సినీ విశ్లేషకుల కోసం ఇప్పటికే ప్రదర్శించగా.. ‘దండోరా’ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
ఇంకా
4.
'2027 వరల్డ్ కప్కు విరాట్ కోహ్లి రెడీ.. అతడి ఫామ్లో అస్సలు సందేహం లేదు' - 2025-12-25T13:02:42+05:30
దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగి.. ఆంధ్రతో మ్యాచ్లో సెంచరీ బాదాడు. దీంతో లిస్ట్-ఏలో సచిన్ రికార్డును బద్దలుకొట్టి.. అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచాడు. దీంతో 2027 వరల్డ్ కప్లో కోహ్లి పాల్గొంటాడా లేదా అనే చర్చ మొదలైంది. దీనిపై విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజా ప్రదర్శనతో 2027 వరల్డ్ కప్కు కోహ్లి సిద్ధంగా ఉన్నాడని అన్నాడు. కోహ్లి ఫామ్, పరుగుల దాహం సెలెక్టర్లకు స్పష్టమైన సందేశం పంపుతున్నట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా
5.
ఆ జిల్లాలకు మహర్దశ.. రూ. 6.5 కోట్లతో అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్ ట్రాక్ - 2025-12-25T14:05:17+05:30
ఉత్తర తెలంగాణ క్రీడాకారుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో జమ్మికుంటలో రూ. 6.5 కోట్లతో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 'ఖేలో ఇండియా' పథకం కింద నిర్మించనున్న ఈ ట్రాక్, గ్రామీణ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అవకాశాలను అందించి, ఉత్తర తెలంగాణను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దనుంది.
ఇంకా
6.
TGSRTCలో ఉద్యోగాలు.. 198 పోస్టులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలివే.. - 2025-12-25T13:09:57+05:30
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 198 ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంకా
7.
చర్లపల్లి స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక హాయిగా పడుకోవచ్చు.. ఫ్రీ వైఫై, లాకర్ - 2025-12-25T13:54:08+05:30
Sleeping Pods at Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు విమానాశ్రయ తరహాలో స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలసిపోయిన ప్రయాణికులు తక్కువ ధరకే విశ్రాంతి తీసుకోవచ్చు. 32 సింగిల్ బెడ్స్తో స్లీపింగ్ పాడ్సర్ కాక వాటిల్హిలో మహిళలు, పురుషులకు ప్రత్యేక కేటాయింపులున్నాయి. గంటలవారీగా ఛార్జీలు నిర్ణయించారు. వైఫై, స్నాక్స్, లాకర్ సౌకర్యాలు కూడా కల్పించారు. ప్రయాణికలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని విశ్రాంతి తీసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. దీనితో పాటు 24 గంటలు వేడి నీటి సౌకర్యం కూడా కల్పిస్తారు.
ఇంకా
8.
అయోధ్యలో కొలువుదీరిన 'కొరియా మాత'.. విగ్రహ రూపంలో తిరిగొచ్చిన ప్రిన్సెస్ సూరిరత్న - 2025-12-25T13:42:42+05:30
క్రీస్తుశకం 48వ సంవత్సరం.. అయోధ్య రాజప్రాసాదం నుంచి ఒక రాజకుమారి సముద్ర మార్గాన వేల మైళ్ల దూరం సాహసయాత్ర చేపట్టింది. అలా దక్షిణ కొరియాకు చేరుకున్న ఆమె.. అక్కడే గయా రాజ్య స్థాపకుడు కింగ్ సురోను పెళ్లి చేసుకున్నారు. ఇలా అక్కడి 60 లక్షల మంది ప్రజలకు మూల పురుషురాలిగా మారిన ఆమె కాంస్య విగ్రహాన్ని అయోధ్యలో ఏర్పాటు చేశారు. భారత్, కొరియా దేశాలను కేవలం స్నేహితులుగానే కాకుండా.. 'సిస్టర్ సిటీస్'గా ఎలా మార్చిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంకా
9.
ఏపీలో విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక.. అకౌంట్లలోకి డబ్బులు జమ - 2025-12-25T13:35:35+05:30
AP Govt Released Tribal Students Scholarship Money: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్షిప్ డబ్బులు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విడుదల చేసింది. గత ప్రభుత్వ బకాయిలను కూడా తీర్చింది. అంతేకాకుండా, రోడ్ల మరమ్మత్తులకు రూ.205.12 కోట్లు, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు రూ.33.60 కోట్లు కేటాయించింది. ఈ మేరకు అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
ఇంకా
10.
దుమ్మురేపిన స్కీమ్స్.. ఎస్బీఐ టాప్, లిస్ట్లో HDFC కూడా.. 10 వేల పొదుపుతో చేతికి లక్షలు! - 2025-12-25T12:33:59+05:30
SBI Mutual Fund: చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో ఆదాయం ఆర్జిస్తుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఏడాదిలో అంటే స్వల్పకాలంలో కూడా అద్భుత రిటర్న్స్ అందించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో ఎస్బీఐ స్కీమ్ టాప్లో ఉండటం విశేషం.
ఇంకా