2.
తమిళనాడులో ఆట మొదలుపెట్టిన విజయ్.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా.. - 2026-05-25T17:15:06+05:30
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ కొద్ది దూరంలో నిలిచినప్పటికీ మిత్ర పక్షాల సాయంతో అధికారంలోకి వచ్చిన విజయ్ తన ఆట మొదలుపెట్టారు. బలపరీక్షలో తనకు అనుకూలంగా ఓటేసిన 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. ఈ ముగ్గురు స్పీకర్కు రాజీనామా లేఖలు సమర్పించడం.. ఆయన వాటికి ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. త్వరలో రానున్న ఉపఎన్నికల్లో ఈ ముగ్గురూ టీవీకే టికెట్ల మీద పోటీ చేసే అవకాశం ఉంది.
ఇంకా
3.
మాజీ ఎంపీ కొడుకు నుంచి నా తల్లిదండ్రులను రక్షించండి.. భీమవరం కలెక్టర్కు అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు - 2026-05-25T18:02:59+05:30
సినీ గేయరచయిత అనంత్ శ్రీరామ్ జిల్లా యంత్రాంగం నిర్వహించే గ్రీవెన్స్కు హాజరయ్యారు. తన తండ్రితో కలిసి జిల్లా కలెక్టరేట్కు వచ్చిన ఆయన , తన కుటుంబానికి ఎదురవుతున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు. తన ఇంటి ముందు ఉన్న స్థలం విషయంలో మాజీ ఎంపీ హరిరామజోగయ్య కుమారుడు బెదరింపులకు పాల్పడుతున్నారని, వృద్ధులైన తన తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి తక్షణమే రక్షణ కల్పించాలని ఆయన విన్నవించారు.
ఇంకా
4.
మరోసారి స్మార్ట్ ఫోన్ ధరలు పెంచిన దిగ్గజ కంపెనీ.. నేటి నుంచే అమలులోకి.. ఏ ఫోన్ ఎంత పెరిగిందంటే? - 2026-05-25T17:57:57+05:30
Price Hike: స్మార్ట్ ఫోన్ ప్రియులకు వరుసగా ధరల షాక్ తగులుతోంది. భారత్లో మంచి మార్కెట్ కలిగి ఉన్న ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్మీ మరోసారి తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ ధరలు పెంచినట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ఫోన్ ధరలు మే 25వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఏ ఫోన్ ధర ఎంత మేర పెరిగింది, కొత్త ధరలు ఎలా ఉన్నాయో? తెలుసుకుందాం.
ఇంకా
5.
వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం.. ఈ పనులు చేయడం తప్పనిసరి..! - 2026-05-25T16:43:27+05:30
ఈ వేసవిలో తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల కారణంగా జనం వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో 42 మంది వడ దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మే 25న రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇంకా
6.
'నా తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి'.. కలెక్టర్కు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఫిర్యాదు - 2026-05-25T17:02:22+05:30
టాలీవుడ్ గేయ రచయిత అనంత శ్రీరామ్ తన తల్లిదండ్రులకు ప్రాణరక్షణ కల్పించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించారు. మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, తమ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారంటూ ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఇంకా
7.
ఇది కదా కావాల్సింది.. 2 నెలల్లోనే 144 శాతం పెరిగిన స్టాక్.. లక్ష పెడితే రూ.2.44 లక్షలొచ్చాయ్! - 2026-05-25T17:01:19+05:30
Trending Stock: టెలికాం రంగానికి చెందిన టెక్నాలజీ కంపెనీ హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ స్టాక్ అదరగొడుతోంది. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈరోజు 10 శాతం మేర పెరిగి సరికొత్త ఆల్ టైమ్ హై స్థాయిని నమోదు చేసింది. అంతే కాదు ఈ స్టాక్ గత 2 నెలల్లోనే 144 శాతం, 4 నెలల్లో 172 శాతం మేర పెరిగింది. లక్ష రూపాయలను రూ.2.44 లక్షలు, 4 నెలల్లో రూ.2.72 లక్షలు చేసింది. మరి ఈ ట్రెండింగ్ స్టాక్ గురించిన వివరాలు ఓసారి మనమూ తెలుసుకుందాం.
ఇంకా
8.
హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక సాయం... రూ.13,600 కోట్లు రీఫైనాన్స్ కోసం IRFCతో ఒప్పందం - 2026-05-25T16:44:05+05:30
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్తో రీ-ఫైనాన్సింగ్ కోసం ఒప్పందం చేసుకుంది. మొత్తం రూ.13,600 కోట్ల రుణాలకు సంబంధించి ఢిల్లీలో సంతకాలు జరిగాయి. ఈ రుణాల వల్ల మెట్రోపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో విస్తరణ ప్రణాళికలకు కూడా అవకాశం కల్పిస్తుంది.
ఇంకా
9.
పవన్ కళ్యాణ్ని రెండుచోట్లా ఓడించిన జనంపై నాకు కోపం.. జనసేనలో జాయిన్ అవుతా: ‘ప్రేమఎంతమధురం’ శ్రీరామ్ వెంకట్ - 2026-05-25T16:02:21+05:30
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి సినిమా వాళ్లకంటే కూడా టీవీ ఆర్టిస్ట్లు ఎక్కువగా పనిచేశారు. జనసేన గెలుపు కోసం విరివిగా ప్రచారం చేశారు. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్ట్లు అయితే.. నాగబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గట్టిగానే కష్టపడ్డారు. ఆయన పోటీ చేసిన పిఠాపురంలో గడపగడపకూ వెళ్లి ఓట్లు కోసం అభ్యర్థించారు. మొత్తానికి వాళ్లు కోరుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు గత ఎన్నికల్లో. అయితే 2019 ఎన్నికల్లో ఆయన రెండుచోట్లా పోటీ చేసి ఓడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరామ్ వెంకట్.
ఇంకా