1.
‘సారీ.. ఈ విషయంలో ఏమీ చేయలేం’. సీఎం రిక్వెస్ట్కు నో చెప్పిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ - 2025-09-25T18:58:57+05:30
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో వాహనదారులకు నిత్యనరకమే. ఇరుకైన రోడ్లు.. ఆపై భారీ సంఖ్యలో వాహనాలు ముఖ్యంగా పీక్స్ అవర్స్లో చుక్కలు కనిపిస్తుంటాయి. కిలోమీటరు దూరానికే గంటల కొద్దీ ప్రయాణించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఇక, ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. కానీ, ఈ సమస్య నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేలా కర్ణాటక సీఎం ఓ ప్రతిపాదన తీసుకొచ్చి.. విప్రో సంస్థకు లేఖ రాశారు. ఆ సంస్థ లోపలి నుంచి వాహనాలు అనుమతించాలని కోరారు.
ఇంకా
2.
సామాన్యులకు శుభవార్త.. ఈ 147 వస్తువులపై జీఎస్టీ 'జీరో'.. ఏది కొన్నా చెక్ చేయండి - 2025-09-25T19:05:49+05:30
New GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ రేట్లను తగ్గించింది. కొన్నింటిపై పూర్తిగా తొలగించింది. దీంతో సబ్బులు, షాంపూల నుంచి కిరాణా సామగ్రి ధరలు దిగివచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమలు చేస్తున్నారు. అయితే, దుకాణాల్లో పాత రేట్లతోనే విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే జీరో జీఎస్టీ ఉన్న 147 వస్తువుల జాబితా ఈ కథనం ద్వారా తెలియజేస్తున్నాం. కొనే ముందు కచ్చితంగా చెక్ చేయండి.
ఇంకా
3.
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఫ్రీగా కోచింగ్.. ఆ పై ఉద్యోగం కూడా.. - 2025-09-25T19:04:22+05:30
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. చదువు పూర్తయ్యాక వారి ముందుకు వచ్చే ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా తక్కువ. కొందరికి తమ కాలేజీల్లో జరిగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారానే ఉద్యోగం దొరుకుతుంది. మంచి మార్కులు, టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నవారు పెద్ద సంస్థల్లోనే అవకాశాలు పొందుతారు. అయితే.. అందరికీ ఆ అదృష్టం కలగదు. క్యాంపస్లో అవకాశాలు రాకపోయినవారు బయట ప్రైవేట్ రంగంలో తగిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసం జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది.
ఇంకా
4.
జగన్కు దేవుడే వరం ఇవ్వలేదు, నేను పూజారిని మాత్రమే.. స్పీకర్ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు - 2025-09-25T18:52:04+05:30
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ మొదలైంది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. జగన్ కోర్టుకు వెళ్లినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. దేవుడే వరం ఇవ్వనప్పుడు, తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు.
ఇంకా
5.
బాలుగారు లేని లోటును తెలిపే.. కీరవాణి పాటకి సునీత కన్నీళ్లు - 2025-09-25T18:10:55+05:30
పాడుతా తీయగా సీజన్ 25కి శుభం కార్డు పడబోతుంది. నలుగురు ఫైనలిస్టులతో జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. ఇందులో కంటెస్టెంట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ఇక ప్రోమోలో సునీత- ఎస్పీ చరణ్ పెర్ఫామెన్స్, పాడుతా తీయగాపై కీరవాణి స్పెషల్గా అల్లిన పాట అద్భుతంగా ఉన్నాయి. మరి నలుగురు పోటీదారుల్లో ఎవరు ఎలా పెర్ఫామ్ చేశారు.. ప్రోమో ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
ఇంకా
6.
వైఎస్ జగన్పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీ వేదికగా ఫైర్, చిరంజీవిపైనా..! - 2025-09-25T16:17:45+05:30
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హీట్ డిస్కషన్ నడిచింది. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గతంలో సినీ పెద్దలు అప్పటి సీఎం జగన్ను కలిసిన వ్యవహారంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో చిరంజీవిపైనా పరోక్ష విమర్శలు చేశారు. ఇటీవల సీఎంను కలిసే జాబితాలో తన పేరును చివర్లో చేర్చడంపైనా.. బాలకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంకా
7.
పాకిస్థాన్కు షాకిచ్చేలా ఉత్తరాదికి భారీ కానుక.. మోదీ సర్కారు ప్లాన్! - 2025-09-25T18:00:41+05:30
ఉత్తరాది నీటి అవసరాల దృష్ట్యా సింధూ నదీ వ్యవస్థలో భారత్ భారీ మార్పులు చేపట్టనుంది. ఇందుకోసం సింధు, బియాస్ నదులను కలుపుతూ 14 కి.మీ మేర భారీ సొరంగం నిర్మించనున్నారు. ఈ సొరంగం ద్వారా రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో సాగునీటిని పెంచడంతో పాటు, ఇతర రాష్ట్రాలకు తాగునీటిని కూడా అందించనున్నారు. ఈ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన డీపీఆర్ వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.
ఇంకా
8.
ఓజీ టైటిల్ మాది కాదు.. నాగవంశీ దానం చేశాడు.. డీవీవీ దానయ్య కామెంట్స్ - 2025-09-25T17:31:37+05:30
DVV Danayya Speech: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోలతోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా, మొదటి రోజునే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని తెలిపారు. సుజీత్ చాలా కష్టపడ్డాడని చెప్పారు. అలాగే 'ఓజీ' టైటిల్ వెనకున్న అసలు సంగతి రివీల్ చేసారు.
ఇంకా
9.
సైబర్ దాడితో సీన్ రివర్స్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్.. ఒక్కరోజే ఎంత పడ్డాయంటే - 2025-09-25T17:11:30+05:30
Tata Group: టాటా మోటార్స్ షేర్లు ఈరోజు ఒక్కసారిగా పడిపోయాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీపై జరిగిన సైబర్ దాడి కారణంగా సీన్ రివర్స్ అయింది. ఈ దాడితో టాటా మోటార్స్ కంపెనీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అంచనాలు మదుపరుల సెంటిమెంటును దెబ్బతీశాయి. 50 మిలియన్ యూరోల నష్టం రావచ్చన్న సంకేతాలు, ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోవడం వంటి కారణాలతో స్టాక్ పై ఒత్తిడి పెరిగింది. అమ్మకాలకు దిగడంతో నష్టల్లోకి జారుకుంది.
ఇంకా
10.
వైసీపీ హయాంలో చంద్రబాబుపై 17, జేసీపై 66 కేసులు.. ఇంకా టీడీపీ నేతల కేసుల లెక్క ఇదే! - 2025-09-25T17:26:38+05:30
వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన కేసుల వివరాలను సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. తనపై 17 కేసులు పెట్టారని వివరించారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై అత్యధికంగా 66 కేసులు పెట్టారని.. 45 సార్లు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాను ఏ తప్పూ చేయనని.. అయితే ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని తేల్చి చెప్పారు.
ఇంకా