1.
నీట్ రాసిన విద్యార్థులకు పండగే.. శుభవార్త చెప్పిన కేంద్రం - 2026-07-14T05:41:11+05:30
NMC Approved 175 Additional MBBS Seats To Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు తీపికబురు. రాష్ట్రానికి కొత్తగా మరో 175 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఈ 275 సీట్లలో పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 సీట్లు.. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అదనంగా 75 సీట్లు మంజూరయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఇంకా
2.
ఈ పాపం నిన్ను వదలదు.. పేర్ని నానికి పవన్ అభిమాని నిరంజన్ తండ్రి శాపనార్థాలు - 2026-07-13T22:00:22+05:30
తన కుమారుడిని పవన్ కళ్యాణ్ పరామర్శించడంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు నిరంజన్ తండ్రి తీవ్రంగా స్పందించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడి ఆరోగ్యాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మనసును బాధపెట్టిన వారికి ఆ పాపం తప్పకుండా చుట్టుకుంటుంది అంటూ పేర్ని నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇంకా
3.
వ్యవసాయమే కాదు.. ఈ 6 ఆదాయాలకు జీరో ట్యాక్స్.. మన దేశంలోనే.. చట్టబద్ధంగా సంపాదించుకోవచ్చు! - 2026-07-12T18:48:02+05:30
Tax Free Income: భారత దేశంలో ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం సగర్వంగా, పూర్తిగా చట్టబద్ధంగా ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేని 7 రకాల ఆదాయ వనరులు ఉన్నాయి. చాలా మంది వ్యవసాయం ఒక్కటే అనుకుంటారు. కానీ, ఇతర మార్గాలు ఉన్నాయి. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఆదాయాలను ప్రతి ఏటా అందుకోవచ్చు. జీరో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే మరికొన్ని అద్భుతమైన మార్గాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఇంకా
4.
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కొత్త ప్రయోగం.. ఏపీలో తొలిసారిగా.. - 2026-07-13T21:59:35+05:30
ఆంధ్రపదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీ అటవీ శాఖ అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం చేపట్టారు. చింతూరు అడవుల్లో సోమవారం రోజున ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పవన్ కళ్యాణ్ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం చేపట్టారు. అలా రూపొందించిన సీడ్ బాల్స్ మనుషుల ద్వారా.. అలాగే దట్టమైన అటవీ ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా వెదజల్లుతున్నారు.
ఇంకా
5.
‘లెనిన్’లో నా పాత్ర చూసి అమ్మ ఎమోషనల్ అయ్యారు.. అలాంటి ముగింపును ఏ తల్లి కోరుకోదు: భాగ్యశ్రీ బోర్సే - 2026-07-13T22:51:04+05:30
‘లెనిన్’ చిత్రంతో కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సినిమా సక్సెస్పై ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో తను పోషించిన 'భారతి' పాత్ర ముగింపు చూసి తన అమ్మ చాలా భావోద్వేగానికి గురైందని, అలాంటి ఎండింగ్ను ఏ తల్లి కోరుకోదని ఆమె తెలిపారు. భవిష్యత్తులో రాజమౌళి దర్శకత్వంలో నటించడమే తన కల అని, సమంత తరహాలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి రెడీగా ఉన్నానని వెల్లడించారు.
ఇంకా
6.
బండి సంజయ్పై సంచలన ఆరోపణలు.. కీలక నేతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ - 2026-07-13T21:19:26+05:30
కేంద్రమంత్రి బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన తెలంగాణ నాయకుడు బేతి మహేందర్ రెడ్డిని పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు. వ్యక్తిగత వివాదాలకు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసిన జనసేన.. ఆరోపణలపై పూర్తి విచారణ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
ఇంకా
7.
కదులుతున్న రైల్లో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే - 2026-07-13T21:39:21+05:30
ఇటీవల ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లోని ఓ కూపేలో కొత్త జంట శోభనం డెకరేషన్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు దీనిని అనుమతించిన టీటీఈపై సస్పెన్షన్ వేటు పడింది. బల్లార్ష నుంచి ముంబయి వెళ్లే నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా, మరో ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అయితే, రైల్లో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియోపై నెట్టింట విమర్శలు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. అది సెలూన్ కోచ్ అని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.
ఇంకా
8.
అనంతపురం: మద్యానికి బానిసై వేధిస్తున్న కుమారుడు.. కత్తెరతో పొడిచి చంపిన తల్లి - 2026-07-13T21:29:16+05:30
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారి రోజు వేధిస్తున్న కొడుకును తల్లే హత్య చేసింది. కత్తెరతో పొడిచి చంపేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతపురం త్రీటౌన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సురేంద్ర అనే 28 ఏళ్ల యువకుడిని అతని తల్లి సునీతమ్మ హత్య చేసింది. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది సునీతమ్మ.
ఇంకా
9.
మా అధీనంలోనే హర్మూజ్.. నౌకలు దాటాలంటే 20 శాతం ఫీజు కట్టాల్సిందే.. ట్రంప్ సంచలన ప్రకటన - 2026-07-13T21:06:55+05:30
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఇరాన్పై దాడులు ప్రారంభించింది మొదలు.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ దాడులకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత నెలలో ఒప్పందం కుదిరినప్పటికీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో హర్మూజ్ జల సంధిని తాము స్వాధీనం చేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
ఇంకా
10.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు.. ప్రపంచంలోనే నాలుగో స్థానం, భారత్లో రెండోది - 2026-07-13T20:36:54+05:30
ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్ల జాబితాలో శంషాబాద్ విమానాశ్రయం నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 140కుపైగా ఎయిర్పోర్టులను పరిశీలించి ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు. పిల్లల సౌకర్యాలు, భద్రత, విశ్రాంతి ప్రాంతాలు, వై ఫై, గూగుల్ రివ్యూలు వంటి అంశాల ఆధారంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు 20లో 18.5 పాయింట్లు లభించాయి.
ఇంకా