Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. 6.5.2020 ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశ భవనము నందు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమము ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యే శ్రీ కరణం బలరామ్ మరియు ఎమ్మెల్సీ పోతుల సునీత, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మూరి కనకారావు.
నేడు వారి ఖాతాల్లోకి నేరుగా పదివేలు.
వైఎస్ జగన్ నేడు మరో పథకం కింద లబ్దిదారులకు చెల్లింపులు జరపనున్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం కింద ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు.
నేడు ప్రభుత్వం గుర్తించిన మత్స్యకారుల ఖతాల్లో పదివేల రూపాయలు జమ అవుతాయి. చేపల వేటను నిషేధించిన సమయంలో వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం పదివేల రూపాయలను ఇవ్వాలని గతంలో నిర్ణయించింది.
ఈ ఏడాది ఈ సాయాన్ని ముందుగానే అమలు చేయాలని నిర్ణయించింది. దాదాపు లక్ష కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. గత ఏడాది నవంబరు నెలలో ఈ సాయాన్ని అందించారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,213; 94 తత్వాలు (Tatvaalu) and views 184,782 Dt : 06-May-2020, Upd Dt : 06-May-2020, Category : News
Views : 1401
( + More Social Media views ), Id : 1 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags :
ongole ,
ysr matsyakara bharosa ,
education minister suresh ,
collector bhaskar ,
chirala ,
mla karanam ,
mlc sunita కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments