Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. చీరాల మండలం లోని, బోయిన వారి పాలెం గ్రామంలో, మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 15 లక్షల రూపాయలకు పైగా, ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా.
గ్రామంలో ఒకచోట గడ్డివాములు ఉండగా, పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి, నిప్పురవ్వలు ఎగిసిపడి దగ్గరలో ఉన్న వాటిపై పడ్డంతో, అవి అంటుకున్నాయి, పెద్ద మంటలు మొదలు అయ్యాయి.
ఆ గడ్డివాముల సమీపంలో ఉన్న, 4 పూరిళ్లు కూడా దగ్ధమయ్యాయి, 2 పశువులు కూడా చచ్చిపోయినట్లు సమాచారం, ఓ మహిళ కు గాయాలు.
విషయ సమాచారం అందుకున్న ఈపూరుపాలెం ఎస్సై సుబ్బారావు, వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పే సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఈ మంటల్లో గాయపడ్డ మహిళను పోలీసు జీపులో, ఆస్పత్రికి తరలించడానికి ఎస్ఐ ఏర్పాట్లు చేయగా, మార్గ మధ్యంలో అంబులెన్స్ రావడంతో, దాని ఆమెను ఆస్పత్రికి పంపారు
విద్యుత్ శాఖ అధికారులు కూడా, ట్రాన్స్ఫార్మర్ ని సందర్శించి, శాఖాపరమైన విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం వచ్చాక, తగిన చర్యలు తీసుకుంటామని, ఎస్ఐ కే సుబ్బారావు చెప్పారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,217; 94 తత్వాలు (Tatvaalu) and views 184,782 Dt : 26-May-2021, Upd Dt : 26-May-2021, Category : News
Views : 1002
( + More Social Media views ), Id : 30 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
fire ,
accident ,
chirala ,
boinavaripalem ,
ipurupalem ,
police ,
si ,
subbarao తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments