1.
ఆర్బీఐ షాక్.. కుప్పకూలిన దిగ్గజ బ్యాంక్ షేరు.. ఒక్కరోజే ఏకంగా 13 శాతం పతనం.. కారణమిదే! - 2024-04-25T11:05:18+05:30
Kotak Bank Shares: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొంత కాలంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తుండగా.. ఆయా షేర్లు కుప్పకూలిపోతున్నాయి. గతంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, పేటీఎం వంటివి ఈ లిస్టులో ఉండగా.. ఇప్పుడు మరో ప్రముఖ బ్యాంక్ ఈ జాబితాలోకి చేరింది. షేరు భారీగా పడిపోతోంది.
ఇంకా
2.
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు: జగన్ - 2024-04-25T11:07:19+05:30
Ys Jagan Pulivendula Speech: వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు.. నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు సీఎం జగన్. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్ వారసులా? అంటూ మండిపడ్డారు. తనను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారన్నారు. వైఎస్సార్పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్ వారసులా? అన్నారు. వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసన్నారు. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులా అన్నారు.
ఇంకా
3.
Ap Elections Live Updates: సీఎం జగన్కు వైఎస్ సౌభాగ్యమ్మ లేఖ - 2024-04-25T05:27:22+05:30
AP Assembly Election 2024 News Live Updates: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అలాగే పులివెందులలో జరిగే సభలో పాల్గొంటారు. అలాగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడప జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. ప్రజా గళం సభల్లో పాల్గొనున్నారు.
ఇంకా
4.
HYD: నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు - 2024-04-25T11:16:43+05:30
హైదరాబాద్ మెట్రో ట్రైన్ లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనకు అసౌకర్యం కలుగుతోందని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా
5.
అవుపాలలో బర్డ్ ఫ్లూ గుర్తింపు.. మరో మహమ్మారిగా మారుతుందా? - 2024-04-25T10:50:39+05:30
నాలుగేళ్ల కిందట విరుచుకుపడిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్దిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇప్పటికీ వైరస్ జన్యుమార్పిడికి గురువుతూ ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఈ తరుణంలో ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, దీని వల్ల ఇప్పటికిప్పుడు మానవాళికి వచ్చిన ముప్పు ఏమీ లేదని తెలిపారు నిపుణులు.
ఇంకా
6.
ఐటీలో ఇలా జరుగుతుందేంటి? మరో ప్రముఖ సంస్థలో 2 వేల మందికిపైగా ఉద్యోగులు అవుట్..! - 2024-04-25T09:59:50+05:30
LTIMindtree Results: భారత ప్రముఖ ఐటీ కంపెనీలు వరుసగా మార్చి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇప్పటికీ ఫలితాలు వెల్లడించగా.. ఇప్పుడు మరో ఐటీ కంపెనీ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇక్కడ కూడా నికర లాభం స్వల్పంగా తగ్గింది. అయితే అన్ని ఐటీ కంపెనీల మాదిరిగానే ఉద్యోగుల సంఖ్య ఇక్కడ కూడా తగ్గడం గమనార్హం.
ఇంకా
7.
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం - 2024-04-25T10:43:01+05:30
Simhachalam Appanna Vinodotsavam: విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో బుధవారం వినోదోత్సవం జరిగింది. ఆలయంలో వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదా కార్యక్రమం నిర్వహించటంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమయిందనుకున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామి వారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులను అనుమానించారు. ఈ సంఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
ఇంకా
8.
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్గా నామినేషన్ - 2024-04-25T08:55:58+05:30
Budi Mutyala Naidu Son Ravi Nomination: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అనకాపల్లి లోక్సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడికి ఆయన కుమారుడు తలనొప్పిగా మారారు. మాడుగుల అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె ఈర్లె అనూరాధ పేరును ప్రకటించినప్పటి నుంచి మొదటి భార్య కుమారుడు రవికుమార్ నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మాడుగుల అసెంబ్లీ స్థానానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఇంకా
9.
ఆ మార్గంలో జర్నీ చేసేవారికి TSRTC బంపరాఫర్ - 2024-04-25T10:32:20+05:30
హైదరాబాద్-బెంగళూరు మార్గంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. ఈ రూట్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికుల రిటర్న్ జర్నీపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. నగరం నుంచి బెంగళూర్ వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ డిస్కౌంట్ వర్తిస్తుందన్నారు
ఇంకా
10.
ప్రైవేట్ ఆస్తిని సమాజ వనరుగా భావించవచ్చా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు - 2024-04-25T09:51:30+05:30
ప్రయివేట్ ఆస్తిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని, ఇది రాజ్యాంగ విరుద్దమంటూ దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అత్యంత కీలకమైన అంశం కావడంతో తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టి.. తీర్పును వెల్లడించింది. ప్రయివేట్ ఆస్తి కూడా సహజ వనరేనని, దానిని మనం భావి తరాలకు అందజేస్తూ.. సమాజ భవిష్యత్తు కోసం విశ్వసిస్తున్నామని సీజేఐ ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
ఇంకా