తెలుగు నాయకుల నేటి సొంత స్ధానిక పార్టీలు - జగన్, పవన్, కేసీఆర్ మరి చంద్రన్న లోకేష్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1731 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1766 General Articles and views 1,285,681; 90 తత్వాలు (Tatvaalu) and views 176,088.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* నాయకుని వ్యక్తిగత జీవితాలకు, రాష్ట్ర అభివృద్ధి కి సంబంధం
* నీతి నిజాయితీ తో ధైర్యంగా కేంద్రం తో సఖ్యతగా
* జగనన్న, 151 ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికల్లో
* అన్న చిరంజీవి పేరు బొమ్మ పేరు
* రాష్ట్ర బీజేపీ తిరుపతి సీటుకై
* లక్ష్మీ పార్వతి లేదా ఎన్టీఆర్ అభిమానులు
* యువకులు కు కొత్త పార్టీని పరిచయం చేసి
* బీజేపీ మరియు కాంగ్రెస్ ఎటూ జాతీయ పార్టీలు
* తెలంగాణా లో కూడా, తెరాసా కేసీఆర్
2 min read time.

ఆంధ్రా లో ఇప్పుడు, సొంత కాళ్ల మీద నిలబడిన, సొంతంగా పార్టీలు పెట్టుకుని, రాజకీయం నడుపుతున్న మొనగాళ్ళు, కేవలం ఇద్దరే. ఒకరు ఫలితాలు సాధించారు, రెండో వారు, సాధించడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

ఆ ఇద్దరూ, ఎవరు? మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న, రెండవ వారు, మన ప్రియ అభిమానుల, కొత్త తరం ఆశాజ్యోతి పవనన్న.

ఏ నాయకుని వ్యక్తిగత జీవితాలకు, మన రాష్ట్ర అభివృద్ధి కి సంబంధం లేదు. మరి ఏవి ముఖ్యము, రాష్ట్ర ప్రగతికి?

రాష్ట్రం ను అభివృద్ధి పధంలో, తక్కువ అవినీతి తో, కోర్టు కేసులు లేకుండా, అవినీతి ఆరోపణలు లేకుండా, రాజ కుటుంబ వంశ పాలన లేకుండా, కొత్త కుటుంబాలు తరాలు వస్తూ, నీతి నిజాయితీ తో ధైర్యంగా కేంద్రం తో మాట్లాడుతూ సఖ్యతగా ఉంటూ, తక్కువ రాష్ట్ర అప్పులతో, సొంతం కుటుంబం పేర్లు పన్నుల పధకాలు కు వాడకుండా ఉండే, బంధువర్గ అవినీతి చేరకుండా, ప్రజలకు చేతులు చాచకుండా, సొంతముగా నిలబడే విధముగా ఉద్యోగాలు కల్పించే, ఉత్తముడు అయితే, భవిష్యత్తు తరాలకు మంచిది.

అయితే ఇద్దరు లో తేడాలు గమనిస్తే, జగనన్న, తన తండ్రి నాటి ముఖ్యమంత్రి రాజన్న పేరు ను వాడుకుంటూ, పైకి ఎదిగారు. నేడు కూడా, ప్రతి పధకంలో కూడా తండ్రి పేరు కలుపుతున్నారు, జనం కు గుర్తు చేస్తూ, పాత సెంటిమెంట్ ను నిలబెడుతూ.

జగనన్న, 2 ఏళ్ళ క్రితం 151 ఎమ్మెల్యే సీట్లు సాధించారు, ఎవరి పొత్తూ లేకుండా, సింగల్ గా. నేటి, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా, పూర్తి విజయం సాధించారు. 10 ఏళ్ల పార్టీ ని, ధీరత్వము తో నిబద్ధతతో ఎన్నో కష్టాలు అవమానాలు పడి, 2000 మైళ్ళు పైగా నడచి, ఈ స్ధాయిలో నిలబెట్టారు. పంచుడు పధకాలు తో అప్పులు పెరిగినా, జన హృదయాలు గెలిచారు.

పవన్ కల్యాణ్, తన అన్న హీరో చిరంజీవి అండతో సినిమా లలో ఎదిగినా, సొంతంగా తన శక్తిని సినిమా లలో నిరూపించుకుని, చిరంజీవి కన్నా ఎక్కువ మంది అభిమానులను పొందారు.

తన వ్యక్తిగత జీవితములో, సమస్యలతో విడాకులు ఇచ్చి మరలా పెళ్ళి ఎక్కువసార్లు చేసుకున్నా, ధర్మ బద్దముగా, ఒకరి తోనే ఉన్నారు. అది రాష్ట్ర అభివ్రుద్ది కి, తక్కువ అవినీతికి, మంచి తనానికి, అడ్డు కాదు. పలు అవినీతి ఆరోపణలు, కేసులు, దొంగ కంపెనీలు, చాటు వ్యవహారాలు చేసే మన నాయకుల బతుకులు బయట పడితే, ఇంకా చాలా ఇబ్బంది కర పరిస్థితిలో వారు ఉంటారు.

రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీల నాయకుల కంటే, పవన్ కల్యాణ్ కు మిస్టర్ క్లీన్ (స్వచ్చమైన, కేసులు అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి, అధికారానికి కొత్త వ్యక్తి) ఇమేజ్ ఇంకా ఉంది. పార్టీని బూత్ స్థాయి నుంచి, పటిష్ఠంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కల్యాణ్ నాయకత్వం పట్ల, జనసేన పార్టీ పట్ల ఇంకా ప్రజల్లో విశ్వాసం పెరగాలి.

ఎక్కడ కూడా, అన్న చిరంజీవి పేరు బొమ్మ, రాజకీయాలలో వాడకుండా, సొంతంగా పార్టీ పెట్టుకుని, తనకు తానుగా నిలబడటానికి, ప్రయత్నం చేస్తున్నారు, ఇతరుల తో పొత్తు పెట్టుకుని, వారితో గౌరవం లేకపోతే పొత్తులు మారుస్తూ. అయితే, అభిమానులను, పార్టీ కార్యకర్తలు గా మార్చుకోవడములో, సరైన మార్గం కానక, నిజాయితీపరుల అండ దొరకక, దోవ తప్పుతున్నారు. 2024 మీద ఆశలు పెట్టుకున్నారు.

రాష్ట్ర బీజేపీ కూడా, ఆయనను అవమానపరుస్తూ, దూరము పెంచుతుంది. 2021 మున్సిపల్ ఎన్నికలలో, బీజేపీ పూర్తి గా విఫలం అయ్యింది. కానీ, తిరుపతి సీటుకై, ఆరాటపడుతుంది, ఓ వైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య రగులుతూ ఉన్నా కూడా.

లక్ష్మీ పార్వతి లేదా ఎన్టీఆర్ అభిమానులు, గతం నుంచి కూడా కోరుతున్నారు ఇది. ఇప్పుడు అయినా, అధికారం కోల్పోయి 23 మంది ఎమ్మెల్యేలు తో మాత్రమే గెలిచి, మున్సిపల్ ఎన్నికల్లో పతనమైన, గతములో చేజిక్కించున్న ఎన్టీఆర్ తెదేపా ను వారి తనయులకు వదలి, 40 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్రన్న శక్తి యుక్తులను ఉపయోగించి, సొంతంగా లోకేష్ కు కొత్త పార్టీ పెట్టి,

యువకులు కు ఆ కొత్త పార్టీని పరిచయం చేసి, జగన్ అలాగే పవన్ లకు ధీటుగా, అజేయ సొంత శక్తి గా ఎదగాలని, చంద్రన్న అభిమానులు కోరుతున్నారు. అప్పుడే, మనమూ కొత్త తరానికి, కొత్త పార్టీ కొత్త ఉత్సాహము ఇచ్చినట్లు గా ఉంటుంది అని వారి భావన.

బీజేపీ మరియు కాంగ్రెస్ ఎటూ జాతీయ పార్టీలు, కుటుంబ పాలన, సొంత అధికారం నిర్ణయాలు ఎటూ ఉండవు. తెలుగు వారు, ఎక్కువగా స్ధానిక పార్టీలు నే కోరుతున్నారు.

తెలంగాణా లో కూడా, తెరాసా కేసీఆర్ సొంత పార్టీ నే. ఆయన ఒక్కరే, తన సొంత ఆలోచనలతో పార్టి పెట్టి, తెలంగాణా సాధించి, తన సొంత బాణీని ప్రజలకు అందుబాటులో కి తెచ్చారు.

మరి వీరు 4 గురు లో, కొత్త కానిది, ఇంకొకరి పాత పార్టీని చేజిక్కించుకుని వాడుతుంది, చంద్రన్న లోకేష్ నే కదా, అని తెదేపా అభిమానులు బాధపడుతున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,285,681; 90 తత్వాలు (Tatvaalu) and views 176,088
Dt : 14-Mar-2021, Upd Dt : 14-Mar-2021, Category : Politics
Views : 596 ( + More Social Media views ), Id : 1032 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu leaders , own local parties , today , jagan , pawan , kcr , chandranna , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content