అధికారం ధనం వైపే జనం - వార్డ్ మెంబర్ గా మనకు కార్యకర్త లేడు, సిగ్గు చేటు కదా పార్టీలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,285; 104 తత్వాలు (Tatvaalu) and views 225,747.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పార్టీలు అంటే నాయకులు, నాయకులు అంటే ప్రజల నుంచి వచ్చిన వారు. అంటే రాష్ట్రం ఈ దుస్తిలో ఉంది అంటే, ప్రజల ఆలోచనలు సంస్కారం మే కారణం. కాబట్టి మనము మాట్లాడేది ప్రజల గురించి మాత్రమే, అంటే మన గురించి మాత్రమే.

నాయకులు ప్రజలు వేరు కాదు. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అంటే, ప్రజలు అప్పులతో బతకడము గొప్పగా అనుకుంటున్నారు, కాబట్టి అప్పులు చేస్తున్నాము అంటారు నాయకులు.

పక్క వాడి సొమ్ముతో బతుకుతూ, వారి మీదే చెత్త వేస్తూ, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి షాపులు ఇల్లులు కట్టి, తమ పేర్లు గొప్పగా చెప్పుకోవడము ప్రజలకు ఇష్టము కాబట్టి, మేము అలాగే ప్రజల ఖర్చుతో పధకాలకు, మా కుటుంబ పేర్లు పెట్టుకుంటున్నాము అంటారు.

కాబట్టి మారాల్సింది మనము ప్రజలమే, అంటే ఒప్పుకోము కదూ? మనము ఓటేసి ఎన్నుకున్న చంద్రన్న, జగనన్నలది తప్పు కాదు. వారికి అధికారము ఇచ్చింది మనమే మిత్రమా, మరువద్దు అనుకుంటూ మిత్రుల సంభాషణ చూడండి.

* గోపీ, రాష్ట్రములో ప్రతిపక్షాల పరిస్తితి, చూసావా? మొత్తం ఓ మున్సిపాలిటీ లో 33 వార్డులు కాగా, 3 ఏకగ్రీవం. వైసీపీ 30, తెదేపా 13, జనసేన 5, బిజెపి 3 వార్డు ల్లో పోటీలో నిలుచున్నారు అంటే, ఏమనిపిస్తుంది రా?

* రామూ, ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయం అక్రమం, అమాయకులైన ప్రతిపక్షాలను మోసము చేసి, అధికార బలము ధన బలము ఉపయోగించి, వారు గెలిచారు, దీనిని నేను తీవ్రముగా ఖండిస్తున్నాను, ఎలెక్షన్ లో మోసము జరిగింది, బాలెట్లు పనిచేయలేదు, దొంగ వోట్లు వేసుకున్నారు, మమ్మల్ని నామినేషన్ వేయనియ్యలేదు, అని సుప్రీం కు వెళతాము.

మా నాయకుల తప్పు లేదు, వేలాది మంది కార్యకర్తలతో, రేయింబవళ్ళు కష్టపడ్డారు, మా స్థానిక పట్టణ నాయకులు ఒళ్ళు వంచి కష్టపడి పని చేసారు, ప్రజల మధ్యలో కరోనా సమయములో తిరిగారు, సోషల్ మీడియాలో ప్రచారం చేసారు, అయినా ఓడిపోయారు అంటే, ఆపుకోలేని ఒప్పుకోలేని సంభ్రమాశ్చర్యాలతో, ఏమీ అనాలో నాకు పాలు పోవడం లేదు అన్నాడు.

* ఆగు బాబు ఆగు, అందుకే చెప్పేది, సరిగా చదువు, అర్ధము చేసుకో, సరిగ్గా విను అనేది. ఇది ప్రెస్స్ మీట్ కాదు, మన ఇద్దరము పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాము. అధిష్టానం వినదులే, వాళ్ళు వదిలేసారు వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటూ, మనము దద్దమ్మలమని తెలిసి.

ఇంకా మున్సిపల్ ఎలక్షన్ కూడా జరగలేదు ఫలితాలు రాలేదు, మనము అలా అనడానికి, ఎటూ ఓడిపోయాక అదే అందాము మీడియా వారితో, కాని మన పార్టీ బాగుకోసమైనా, మనము ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలి కదా?

అధికారములో తెదేపా ఉన్నప్పుడు కూడా, ఇదే పరిస్తితి కదా నాడు. అధికారము ధనం ఉన్నోళ్ళ వైపే జనం కూడా. వార్డ్ మెంబర్ గా మనకు కార్యకర్త లేదు అంటే, మనకే సిగ్గు చేటు కదా?

* అవును నిజమేను, చూడు, నాకేమనిపిస్తుంది అంటే, తెదేపా 20 ఏళ్ళ కష్టానికి, చివర 10 ఏళ్ళలో అధికారం అనుభవించినవారు, 20 పైగా వార్డులలో, పార్టీ జెండా పట్టి ప్రచారం చేసే, ఒక్క బలహీన ముదుసలి కార్యకర్తనైనా, పట్టుకుని నిలబెట్టలేక పొయ్యాము అంటే, ఆ మున్సిపాలిటీ ఊరు అధ్యక్షుడికి, పార్లమెంట్ స్థానం ఇంచ్చార్జ్ కి, జిల్లా మరియు జోన్ అధ్యక్షుడికి, 2 లక్షలు అవార్డులు ఇచ్చి 2 యేళ్ళ పనితనానికి, అభినందించాలి.

చక్కా గా 20 వార్డులలో, పార్టీని సజీవముగా పాతి పెట్టినందుకు, చివరికి జెండా ప్రచారం కూడా లేకుండా. వీరినే, రేపు రాష్ట్ర కార్యదర్శులు అధ్యక్షులుగా ప్రకటిస్తే?

కొత్త గా వచ్చిన, ఒక్క ఎమ్మెల్యే లేని, జనసేన కు 5 గురు 5 వార్డులకు దొరికితే, 20 ఏళ్ళ అనుభముతో మనకు 13 మంది మాత్రమే, దొరకడం అవమానం కాదా?

* అదే కదా సమస్య, మన వాళ్ళు సరిగ్గా పని చేస్తే, ఖాళీ గా ఉండే వాడు ఒక్కడైనా, మన వర్గానికి దొరకరా? జెండా మోయించి కనీసం ప్రచారం చేయించరా? ఎవరికోసం, ఈ త్యాగం, సొంత పార్టీని చంపడం? నాకు అర్ధము కావడము లేదు. మరలా ఎమ్మెల్యే టికెట్ట్ కావాలి అంటారు, ఈ మాత్రం దానికే.

* మరి, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు, ఏమెమో మీటింగ్లు పెడతారు, ఏదేదో మాట్లాడుతారు టీవీల్లో సభల్లో, డిల్లీ అధిష్టానికి, ఏమని చెప్పుకుంటారు, 3 వార్డు అభ్యర్ధులు మాత్రమే దోరికారు, ఇంత మంది నాయకులు ఉండి అంటే.. డిల్లీ వారు కూడా, అందుకే, వీరితో అనవసరం అని, వీరిని పట్టించుకోరు.

* జనసేన కు 5 గురు దొరికారు అంటే, తెదేపా కన్నా నయమే అనుకోవాలి. కానీ 5 గురు, 30 మంది అవ్వడానికి, ఇంకా ఎన్నేళ్ళు పట్టాలి? ఎన్ని ప్రభుత్వాలు మారాలి?

* ఈ కారణాలు చాలవా, ప్రతిపక్షాల చేతకాని, స్థానిక పట్టణ జిల్లా రాష్ట్ర కేంద్ర నాయకులు రాజీనామా చేసి, ఉత్సాహవంతులైన యువకులకు సీట్లు ఇస్తే, వారు కొత్త వారులే, సరిగ్గా చేయలేదు అని సర్దుకుందాము.

ఈ సీనియర్లు దేనికి, 10 మంది డమ్మీ కాండేట్లను కూడా నిలపలేనప్పుడు?

మనము గెలుపు గురించి, అసలు మాట్లాడటము లేదు. కనీసము జెండా పట్టి, బాలెట్ పేపర్ మీద ఉండే, ఒక మనిషి ఒక కార్యకర్త గురించి, మాత్రమే మాట్లాడుతున్నాము.

ఏమి మనుషులో, మార్పు రావాలి అంటారు, మరి బలహీనుల వైపు అండగా ఉండటానికి, ఒక్క మనిషి రాడు.

గెలిచిన తర్వాత మాత్రం, అధికారం ధనం కోసం కులము గోత్రము, వెతుక్కుని వస్తారు ప్రజలు. అందుకే, నాయకులది తప్పు కాదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,285; 104 తత్వాలు (Tatvaalu) and views 225,747
Dt : 03-Mar-2021, Upd Dt : 03-Mar-2021, Category : Politics
Views : 759 ( + More Social Media views ), Id : 998 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra opposition , bjp , janasena , tdp , public , money , power , activist , ward member , shame
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content