అధికారులు, నాయకులు, ప్రజలు. ఈ ముగ్గురు మూడు దిక్కులలో ఉంటారు, అందుకే ప్రజాస్వామ్యము - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1762 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1797 General Articles and views 1,389,638; 94 తత్వాలు (Tatvaalu) and views 184,419.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నీతి, నిజాయితీ, ప్రజల యందు గౌరవం, బాధ్యత, క్రుతజ్ఞతలు ఉన్న, ఏ అధికారిని లేదా అధికార నాయకులను కూడా, మనము ఇన్ని సార్లు, ప్రజల కోసము మిగతా అధికారుల లాగా, సోషల్ మీడియాలో రోజూ అభివ్రుధి పనులను పెట్టమని అడగక్కరలేదు. వారు తినే ప్రతి గింజ లో, అనుభవించే ప్రతి సౌకర్యములో, ప్రతి పౌరుడి కష్టం త్యాగము తో కూడిన టాక్స్ ధనం ఉంది అని గుర్తు ఉంటే చాలు.

అది తెలిసి గుర్తెరిగిన మంచి అధికారులు నాయకులు, గౌరవంగా రోడ్డు న వెళ్ళే సామాన్యులను కూడా, గౌరవిస్తారు , వారి ప్రశ్నలకు జవాబు ఇస్తారు. అందుకే మోడీ గారు, నేను ధర్మ కర్తను మాత్రమే, కాపలాదారుడిని మాత్రమే అన్నారు మర్యాద సంస్కారం తో, అది చేతలలో కూడా చూపించారు.

ఒక ఇల్లాలు, తన భర్తను, ఈరోజు ఎక్కడ కు వెళ్ళారు ఏమి చేశారు, అని రోజూ అడుగుతూ ఉంది అంటే, భర్తలో లోపం ఉన్నట్లు కాదా? భార్య దగ్గర దాచాల్సింది, తప్పించుకు పోవాల్సిన అవసరం ఏముంది? మంచి ఉత్తమ బాధ్యత గల భర్త, ముందే చెపుతారు, నేను కూరగాయలు కు వెళుతున్నా అని. అంతే గాని, అడ్డగోలుగా లెక్క లేకుండా నువ్వు ఎవరు అసలు, ఏ శాస్త్రం లో ఉంది ఇలా నీకు జవాబు చెప్పాలని అని అడగరు, కోపగించుకోరు, అలగరు.

ఏ మంచి తల్లి అయినా, తండ్రి ఏమీ తేకపోయినా అనుమతి ఇవ్వకపోయినా, ఏదో ఒక దానితో వండి, బిడ్డలకు భోజనం పెడుతుంది. తన బాధ్యత మరువదు, సాకులు చూపించి.

మరి మన అధికారులు కు ఆ బాధ్యత లేదా? పై అధికారులు చెప్పాలా? ఆ పని చేయడానికి, ఒక మనిషి సాధన సంపత్తి పదేళ్లు తర్వాత వస్తుంది అంటే, అప్పుడు దాకా ఆగుతామా? మరి ఇతర అధికారులు ఎలా చేస్తున్నారు ఇవే పనులు? వారికి ఉన్న దానితో నే సర్దుబాటు చేసుకుని, ప్రజలను గౌరవించడం లేదా? ప్రజలకు తెలియచెప్పడము లేదా?

ఆత్మాభిమానం, స్వాభిమానం, గౌరవం ఉండి, ప్రజలు అంటే పాలకులు, నాకు జీతం ఇస్తున్న వారు అనే భావన గుర్తు ఉంటే, మన దేశం ఎంతో ముందుకు పోతుంది కదా.

ఒక జర్నలిస్టు లేదా ఒక సామాన్య వ్యక్తి అడుగుతూ ఉంటే ప్రజల కోసము, మరి ఆ ఊరి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి గారికి బాధ్యత లేదా? వారు అడగరా నిలదీసి అధికారులను?

అలాగే ప్రజలు నోరు తెరిచి అడగందే, ఏ వ్యవస్ధా మారదు. ఇది మా ఒక్కరి సమస్య కాదు, ప్రజల అందరి సమస్య, అన్ని స్ధాయి ల లో. వాటితో పాటే బాధ్యత, ఇతర సమస్యలు బయటకు వస్తాయి.

ఆలోచన చేయండి, అధికారులు, నాయకులు, ప్రజలు. ఈ ముగ్గురు మూడు దిక్కులలో ఉంటారు, నడుస్తారు, ఆలోచన చేస్తారు. అందుకే ప్రజాస్వామ్యము ఇలా తగలపడుతుంది. ముగ్గురూ ఒకే దిక్కున ఆలోచన చేస్తే, మన దేశము చాలా ముందుకు పోతుంది. మేము మాట్లాడింది తప్పు అయితే, మన్నించాలి. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1797 General Articles and views 1,389,638; 94 తత్వాలు (Tatvaalu) and views 184,419
Dt : 12-May-2020, Upd Dt : 12-May-2020, Category : Request
Views : 653 ( + More Social Media views ), Id : 542 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : officers , leaders , people , looking working in three directions , democracy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content