మోదీ ఆంధ్రా కు న్యాయం చేస్తున్నారా లేదా, మీరు ఆయనను ఏమీ అనడం లేదు? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,891; 104 తత్వాలు (Tatvaalu) and views 225,182.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇదే మీలో, చాలా మంది చదువుకున్నా కూడా, చేస్తున్న తప్పు. మన తప్పు ఆలోచన చెయ్యరు, ఎదుటి వారి తప్పు నే చెపుతారు, అది తప్పో రైటో తెలీకపోయినా.

అది అడగాల్సింది, గడ్డిపరక లాంటి విలేఖరిని కాదు, అధికారం లో లేని పవన్ ను అలాగే, పసలేని రాష్ట్ర బీజీపీ నాయకులను కాదు అడగాల్సింది.

అసలు ఎవరినైనా ప్రశ్నించాలి అంటే, నాయకుడు గా తక్కువ ధనం ఉండి, ఎక్కువ నీతి నిజాయితీ ఉండాలి. అలాంటి వారిని, మన తెలుగు వారు నాయకుడు గా అంగీకరించి ఓటు వేస్తారా? ఒక కేజ్రీవాల్ లాంటి వారిని మనం ఎన్నుకుంటామా?

మన తెలుగు వారికి ప్రజాస్వామ్యం అంటే, తెలిసింది అల్లా, కుటుంబ పాలన మాత్రమే, మనల్ని పూర్తి నాశనం చేస్తుంది చేయాలి, అని మన తెలుగు వారి ఆత్మ సంకల్పం. అందుకే మనము బానిసలుగా, కొన్ని కుటుంబాలకే పాద నమస్కారం చేస్తు ఓటు వేస్తాము.

మనలో ఇంకోకరికి ఆ అర్హత లేదు అని చెపుతాము, భారత రాజ్యాంగం అంగీకరిచినా కూడా, మనము అంగీకరించము కదూ? పధకాలకు వారి కుటుంబ పెర్లు పెట్టుకున్నా, మనం నీతి గా వంగి సలాం కొడతాము. అలాంటి మనకు, కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము నిజాయితీ సంస్కారం ఉంటుందా?

ఎవరో చెప్పారు, కమల్ హాసన్ అన్నారు అంట, ఈ మధ్యలో, పక్క రాష్ట్రం లో, అవినీతి చక్రవర్తి జగనన్నను గెలిపించి, నీతి నిజాయితీ గల పవన్ ఓడించారు, అలాంటి దిక్కుమాలిన పరిస్తితి, మన దగ్గర కూడా వస్తుంది ఏమో అని. చిత్రం కదు, మనకు మనము, కుటుంబ బానిసలు గా ఉందామని నిర్ణయం తీసుకుంటే, కమల్ హాసన్ ఎవరండీ, నీతులు చెపడానికి?

అయినా, మనం మంచి ఈ చెవితో విని, ఆ చెవితో వదిలెయ్యమా? మనకు ధనం పంచితెనే మన వర్గం అయితేనే ఓటు వేస్తాం, అది కుటుంబ వారసత్వం బానిసత్వ ఉన్న, ప్రజాస్వామ్యానికే మన ఓటు. మనలాంటి సామాన్యులను సేయెం గా చూడలేము, అంత అత్యుత్తమ సంస్కారం మనది, గత 20 ఏళ్ళుగా.

మనకు ప్రత్యేక హోదా అయినా, ఇంకోటి అయినా, కేంద్రం అన్యాయం చేసారా లేదా అని అనాల్సింది చెప్పాల్సింది, మా 2 వ అబ్బాయి తెదేపా చంద్రన్న, మా 3 వ అబ్బాయి వైకాపా జగనన్న.

వారిద్దరూ ధైర్యముగా, మోదీ అన్యాయం చేసారు అని ఎక్కడైనా ఆవేశముగా, ఈ 2 ఏళ్ళలో ఢిల్లీలో ఆవేశముగా అరిచినట్లు ధర్నా చేసినట్లు, ఫొటో వీడియో ఉంటే పంపగలరు. మన తెలుగు గల్లీలో అరుపులు వేస్ట్. అంటే, మనకు పెద్ద అన్యాయం జరగలేదు అనే కదా అర్ధం?

పంజాబ్ హర్యానా రైతులకు అన్యాయం జరిగితే వారి భావనలో, వెంటనే అందరూ ఢిల్లీ రోడ్లు ఎక్కి, నగరాన్ని బంధించారు. తమ కోపాన్ని బాధను, ప్రపంచానికి తెలియ చేసారు. ప్రపంచం మొత్తము వారి బాధ గమనించింది. అంటే, వారికి నష్టం కలిగితే, ధర్నా చేసి అరవాల్సింది, డిల్లీలో అని మనకు పాఠము చెప్పారు. కాని వైకాపా, తెదేపా కు ధైర్యం ఉందా అక్కడ అరవడానికి?

మరి మా 2 అబ్బాయి, తెదేపా చంద్రన్న, గతము లో డిల్లీ ఆంధ్రా భవన్ లో, చాటు గా ధర్నా చేసి, మమ అని పించారు. అంతే గాని, జంతర్ మంతర్ దగ్గర లేదా ఇంకో చోట పబ్లిక్ గా ధర్నాలు చేయరు, చేయలేదు. ఆంధ్రా భవన్ లో చేయడము అంటే, మన ఇంట్లో ధర్నా చేసినట్టు అని, మనము అనుకోమని చెవిలో పూలు ఉన్నాయని, మన చంద్రన్న నమ్మకం.

పోనీ ఇప్పుడు 2 ఏళ్ళు గా, 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని డిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారా? ఆ దమ్ము ఉందా? అసలు ప్రత్యేక హోదా దేనికి అవసరము లేదు అని అన్నదే ఆయనే కదా. 2 వైపులా మాట్లాడి, కేంద్ర పాకెజీ అంగీకరించారు కదా. ఇక తెదేపా కి మూసుకుని ఉండటం తప్ప, ధైర్యం ఎక్కడ ఉంది.

ఇంక జగనన్న, 150 మంది ఎమ్మెల్యేలు, ఇంత మంది ఎంపీలు ఇస్తే, కేంద్రం మెడలు వంచుతామన్నారు. ఇప్పటి దాకా, తాను దించిన తల ఎత్తలేదు, ఢిల్లీ వెళ్ళినప్పుడు అల్లా. రాజన్న ఉంటే, కేంద్రం ఎంత భయపడింది, ఇప్పుడు జగనన్న ఎంత భయపడుతున్నారు, అసలు ఇద్దరుకూ పోలికే లేదని జనము అంటున్నారు కదా.

తెలుగు నేల పై ధర్నాలు, ఇక్కడ సవాళ్ళు తప్ప, పంజాబ్ రైతుల్లా, ఢిల్లీలో 150 ఎమ్మెల్యేలతో పరేడ్ చేసే దమ్ము ధైర్యం ఉందా? లేదు.

అంటే అర్ధం, జగనన్న చంద్రన్న లెక్కలో, ఆంధ్రాకు కేంద్రం అన్యాయం చేయలేదు. ఇంకా మా లాంటి వారు, మోదీ ని తప్పు పట్టాల్సిన పని ఉందా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,891; 104 తత్వాలు (Tatvaalu) and views 225,182
Dt : 15-Apr-2021, Upd Dt : 15-Apr-2021, Category : Politics
Views : 704 ( + More Social Media views ), Id : 1097 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : modi , justice , andhra , jagan , chandranna , pavan , viranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content