అందరూ దొంగలే అయితే, అలాంటి వారని తెలిసీ ఓటు వేసిన, మనము పెద్ద దొంగలం కాదా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1958 General Articles and views 1,587,993; 97 తత్వాలు (Tatvaalu) and views 199,693.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

అందరూ దొంగలే అయితే, అలాంటి వారని తెలిసీ ఓటు వేసిన, మనము పెద్ద దొంగలం కాదా? నిర్లక్ష్యముగా తలుపులు బార్లా తీసి, దొంగ ది మాత్రమే తప్పు అంటే ఎలా?

దయచేసి మా (మన) 4 గురు (బీజేపీ, తెదేపా, వైకాపా, జనసేన) ఆణిముత్యాల లాంటి పిల్లల్ని (నాయకులను) ఏమీ అనకండి, మనకు బుద్ది జ్ఞానం సంస్కారం ఉంటే.

రాష్ట్రం లో అధికారం లో ఉండి, అనంత గగనం లో, కొందరు మేతావుల దివ్య చక్షువులకు మాత్రమే కనిపించే, అభివ్రుద్ది చూపిస్తుంది, కేవలం 2 వ, 3 వ పిల్లలు నాయకులు మాత్రమే. మనకు 1, 2 నచ్చరు, సరిగ్గా గత అనుభవముతో ఆకాశం లో అభివ్రుద్ది చూపలేరేమో అని.

మేము విలేఖరులు గా, ఆ 4 గురి (అంటే మనందరి ప్రజల) మంచి కోరి, సమస్యల గురించి చురకలు వేస్తూ కొన్నిటికి పరిష్కారాలు చూపుతూ, మరల మరలా మెత్తగా, గుర్తూ చేస్తు ఉంటాము.

పప్పు చారు లో, కరివేపాకు లాంటి వారము, అంత కన్నా, మాకు శక్తి లేదు కదా? అందుకే వారూ, చూసి, ముసి ముసి నవ్వులు నవ్వు కుంటారు.

లక్షల జనానికి కధలు చెప్పేవారము మేము అయితే, మాకు నీతులు చెప్పెది వీళ్ళా (మీడియా) అని, 5 ఏళ్ళ తర్వాత తమ బంగారు భవిష్యత్ తెలిసి కూడా. అటు దూకితే పోయే, వద్దు అనేది ఎవరు?

మీడియాలో కూడా, పిల్లలకు అమ్ముడు పోయి, కాళ్ళు వత్తే వారు ఉన్నారు. ఓటర్లు మరియు నాయకులు అమ్ముడు పోతే పార్టీలు దూకితే లేని తప్పు, మీడియా అమ్ముడు పోతే తప్పా అంటే? మన దగ్గర జవాబు లేదు.

అసలు అమ్ముడు పోని వారు ఉన్నారా, ఏ ఇంట్లో అయినా? ఇదో కోటి రూపాయల, అందరికీ తెలిసిన జవాబు లేని వింత ప్రశ్న.

మా పిల్లలు, ఇతర దేశాల నియంతలు లాగా, రాష్ట్రాన్ని మొత్తము, ఒకేసారి దండయాత్ర చేసి లేదా పొలీసు సైనిక తిరుగుబాటు చేసి, ఆక్రమించుకోలేదు, కదా?

తమ శక్తి సామర్ధ్యాల మీద నమ్మకము లేక, మామ పేరు చెప్పుకుని, పార్టీ తీసేసుకుని ఒకరు,

తండ్రి పేరు చెప్పుకుని రాష్ట్రమంతా తిరిగి కొత్త పార్టీ తో ఇంకొకరు,

పాత రామన్న లేదా రాజన్న రాజ్యం తెస్తామని, ముందే బల్లగుద్ది, మైకులు పగలగొట్టి, మైళ్ళు నడిచి చెపితే,

అదే మాకు మా బిడ్డలకు మంచిది అని ఆశపడి దురాశ తో, కావాలని మరలా మరలా, వారి అనుచరులు అంటే, 50 శాతం కన్నా తక్కువ మంది మన తెలుగు ప్రజలు గెలిపించారు.

భారత రాజ్యాంగము ప్రకారము, ప్రజాస్వామ్యబద్దము గా, తెలుగు ప్రజలు, ప్రతి అస్సెంబ్లీ నియోజకవర్గము లో, ఏదో ఒక దానికి ఆశపడి, ఓటరు స్లిప్ పట్టుకుని లైన్ లో నిల్చుని, చేతి వేలు కు బులుగు సిరా చుక్కతో, ఓట్లేసి ఎన్నుకుంటేనే, ఇంకొందరు ఓట్లు ఎగ్గొట్టి అవకాశం ఇస్తేనే, మా పిల్లలు అధికారకముగా నాయకులు అయ్యారు.

మా పిల్లల పాలన లో తప్పులు ఉంటే, ముందు గా అన్ని తెలిసి కూడా ఆ గెలిపించిన, 50 శాతం మంది ప్రజలను తిట్టండి. ఒకసారి చేస్తే పొరపాటు అంటాము, కానీ తర తరాలు చేస్తే? అది కావాలని, త్రికరణ శుద్ది గా తప్పు చేయడమే. ఆ మాత్రం శిక్షలు ఉండవద్దా?

అంటే, మనల్ని మనమే తిట్టుకోవాలి. అది ఎటూ మనకు చేత కాదు, కాబట్టి, ఆనందము గా ఆస్వాదిస్తూ, రోజులు నెట్టి వేస్తే, కరోనా తో మిగిలి ఉంటే, తర్వాత చూద్దాము.

తెలుగు దొంగల పార్టీ మరియు స్టేల బాబు అని వారు అంటారు. కేసుల రాజాలు జైలు పక్షులు బైలు బాబు అని వీరు అంటారు. అటు ఇటు దూకుతారు, వారిని వీరు వీరిని వారు మార్చుకుంటారు, అక్కున చేర్చుకుంటారు, కోవర్టులు గా దగ్గర ఉండి పంపుతారు.

2 వాడు గత 10 ఏళ్ళు దోచుకుంటే, 3 వ వాడికి 5 ఏళ్ళు అన్నా దోచుకునే, అవకాశం ఇవ్వమా? అంత కుళ్ళు అయితే ఎలా? ఓపిక సహనం లేకపోతే ఎలా? మన పిల్ల మధ్యనే అంత తేడాలు బేధాలు పక్షపాతం చూపిస్తే ఎలా? అని కొందరు అంటారు.

ఒకరి మాట మీద పోలేము కాబట్టి, అందరూ దొంగలే అనుకుందాము కాసేపు. మరి ఆ ఉత్తమ దొంగలకు, తాళాలు ఓటుతో మనస్పూర్తి గా ఇచ్చిన, మనము పెద్ద దొంగలము కాదా? అని ఇంకొందరు.

అమరావతి లో మింగేశారు, గ్రాఫిక్స్ అని వాళ్ళు అంటారు. వైజాగ్ మడిచేశారు, అంతా షో, అని వీరు అంటారు

వీరిద్దరూ తప్ప, మూడో వారు వద్దు, ఓటు కే మన నోటు అదే మన ప్రగతి కి చేటు, అని మన ఓటర్లు సాంప్రదాయం గా, మత్తులో ఆడుతూ పాడుతూ, అదే పని చేస్తూ ఉంటారు.

మన బతుకులు ఇంతే, ఇంకో 20 ఏళ్ళు, కుటుంబ బానిస లు గా. జై కరోనా గురూ, అందుకే గదా గురువు గారు వచ్చింది?

కాబట్టి, ఆ ఇద్దరు పిల్లల కు, పదే పదే ఆ శక్తి ఇచ్చిన, తప్పుడు రకాలు ఎవరు? ఓటర్లు అంటే మనమూ.

అందుకే మన నినాదం, తప్పు ఏనాడూ నాయకులు ది కాదు, అమ్ముడుబోయి వారికి ఆ శక్తి ఇచ్చిన, తప్పుడు ఓటర్లు ది, మాత్రమే.

మన దొంగ బుద్దులు మారందే, మన నుంచి వచ్చే, మన నాయకులు మారరు, వారి బుద్దులు మారవు.

అందుకే నాయకులు కు కూడా కోపం రాదు, తప్పులు ఓటర్లు వి కాబట్టి.

నిర్లక్ష్యముగా తలుపులు బార్లా తీసి, దొంగ ది మాత్రమే తప్పు అంటే ఎలా?

అందరూ అడుగుతారు, నాయకుల తప్పులకు ఎందుకు శిక్షలు వెంటనే ఉండవని?

ఎందుకంటే, ఆ పాపాలను, ఓటర్లు కూడా పంచుకుంటారు కాబట్టి. శిక్షలు లేటు అయినా, ఏనాటికీ వారు వీరు తప్పించుకోలేరు సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,587,993; 97 తత్వాలు (Tatvaalu) and views 199,693
Dt : 01-Jul-2021, Upd Dt : 01-Jul-2021, Category : Politics
Views : 709 ( + More Social Media views ), Id : 1221 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leaders , everyone , thief , vote , people , voter , jagan , chandranna , pawan , veeranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content