Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. సాక్షి లో ని వార్త ఇది - 'కరోనా బారినపడి కోలుకుంటున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు'.
అందుతున్న వార్తల ప్రకారం, భూమన గారి ఆరోగ్యం బాగుంది, బాగుండాలి అని అభిమానులు అందరూ ఆశిస్తున్నారు.
జగన్ గారు స్వయంగా మాట్లాడటం, మంచి పరిణామం. అలా రాష్ట్రంలో, ప్రభుత్వ వైద్యం పొందుతున్న ఉత్తమ బాధ్యత గల, మనస్పూర్తిగా ప్రభుత్వము ను గౌరవించే ఎమ్మెల్యేలు, ఎంపీలు ను ప్రోత్సాహం చేయాలి. ఇంకెవరన్నా వేరే ఉంటే చెప్పగలరు. ఎందుకంటే ఆత్మాభిమానం, జగన్ లేదా ప్రభుత్వం అంటే, నమ్మని కృతజ్ఞతలు లేనివారు, ఇతర రాష్ట్రాల కు వెళతారు, నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి. వారు అవకాశ వాదులు, అని అభిమనుల వాదన.
ఇప్పుడు, తిరుపతి లో ఉన్న, ప్రతిపక్ష నేతలు, ఆసుపత్రి సౌకర్యాలు లేవు, సరిగ్గా డాక్టర్లు చూడటం లేదని చెప్పలేరు. ఇది ఒక ఎమ్మెల్యే వలన ప్రభుత్వ నైతిక విజయం, కనీసం తిరుపతి చిత్తూరు జిల్లా కు.
ఇప్పుడు అయినా, ప్రతి పక్షాలు, అలాగే పాలక పక్షం, తమ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించడం, లోటుపాట్లను అధికారులు కు తెలియజేస్తే, ప్రజలు సుఖపడతారు. అలాగే ప్రతిపక్షాలు బిజెపి, జనసేన, తెదేపా, కరోనా సమయంలో కూడా, ప్రజలకు అండగా ఉన్నారు, అని తెలుస్తుంది కదా ఇలా చేస్తే.
జనసేన కార్యకర్తలు మొన్న, ఆక్సిజన్ సిలిండర్ లు పంచారు ప్రభుత్వ ఆసుపత్రు ల కు, అలాంటి మంచి పనులు అందరూ మొదలు పెట్టాలి.
కనీసం, తెదేపా యువ నాయకుడు ఆశాజ్యోతి లోకేష్, బయటకు వచ్చి, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు తెలియచేయాలి. అలాగే, కార్యకర్తలు ను ప్రోత్సాహం చేయాలి.
గతంలో జగన్ గారు, రాష్ట్రంలో లో లేరు అన్న పోలిక తేకుండా, సీనియర్ మాజీ ముఖ్యమంత్రి అనుభవజ్ఞులై న చంద్రన్న గారు కూడా, ఆంధ్రా లో కుప్పంలో లేదా అమరావతిలో, వీడియో కాన్ఫరెన్స్ ల తో ఇంట్లో ఉన్నా బాగుంటుంది. ఇన్నేళ్ళ మన తెదేపా పాలనలో, సరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టలేదు అని, మీరు స్వయంగా ఒప్పకుని, హైదరాబాద్ లో, మీ ఆరోగ్య క్షేమం కోసం, సొంత తెదేపా కార్యకర్తలు ను విడిచి, దూరంగా ఉండటం, మన పార్టీ అభిమానులు కే నచ్చడం లేదు.
గతంలో జగన్ లేకపోయినా, ఇప్పుడు నేనున్నా ను, అనేవారు ఉత్తమ నాయకులు కదా, కాదంటారా? కోపం తెచ్చుకోవద్దు దయచేసి.
కాగా, తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో, భూమన గారు చికిత్స పొందుతున్నారు అని మనందరి కీ తెలుసు. మాకున్న సమాచారం ప్రకారం, ఆయనే ఒకే ఒక్క ఎమ్మెల్యే, జగన్ ఆరోగ్య పధకాల అమలు ను, స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండి సమీక్షిస్తున్నారు.
అలా అని, ఇతరుల లాగా, క్వారంటైన్ అని 2 వారాలు మాయం కాలేదు. ప్రభుత్వ మీటింగ్ ల లో కూడా, ఇంటర్నెట్ ద్వారా పాల్గొంటున్నారు. ఏరోజు ఫోటోలు, ఆరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రతి ఎమ్మెల్యే అలాగే ఉండాలి. సోషల్ మీడియాలో జగన్ పధకాల ఫోటోలు తమ బొమ్మలు తో పెట్టి, పబ్బం గడుపుకోవడం కాదు. తాము సొంతంగా ప్రజలతో పధకాలతో కలసిన మమేకమై న ఫోటోలు పెట్టాలి, జగన్ గారి ఖ్యాతి ని పెంచాలి. ఉత్తమ ఎమ్మెల్యే, ఎంపీ అనిపించుకోవాలి.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,838,072; 104 తత్వాలు (Tatvaalu) and views 221,660 Dt : 30-Aug-2020, Upd Dt : 30-Aug-2020, Category : General
Views : 678
( + More Social Media views ), Id : 667 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
bhumana ,
jagan ,
phone ,
ruling ,
opposition ,
public ,
govt ,
hospitals Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments