ఆంధ్రా అసెంబ్లీ చిత్ర విచిత్రాలు వీళ్ళ ను వాళ్ళు అవమానం, హైదరాబాద్ స్ధానిక ఓటు శాతం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,700; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇప్పుడు జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చిత్ర విచిత్రాలు చూస్తున్నారా? అబ్బే మరలా 2024 లో , ఎవరన్నా ధనం ఇచ్చి ఓటు వేయమని, మన వర్గం వారు చెప్పిన దాకా, బిగ్ బాస్, ఇంటర్నెట్ ఆటలు పాటలు, సినిమాలు సీరియల్స్, మొక్కుబడి పూజలు తో, ఫుల్ బిజీ. నా సంపాదన, నా కుటుంబం, నా స్వార్థం అంతే, ఇంకేమి పట్టవు. అంటారా?

చూసారా, చదువుకున్న మన హైదరాబాద్ స్ధానిక మూర్ఖులు, ఓటు వేయడం కు కనీసం 50 శాతం కూడా రాలేదంటా, ప్రజాస్వామ్యం ను హేళన చేస్తూ? వీళ్ళ కు, ప్రభుత్వం ను ప్రశ్నించే హక్కు ఉందా? ఓటు వేయని వారికి 500 ఫైన్ వేసి, బస్సు రైలు పాసులు, సౌకర్యాలు, డిస్కౌంట్ లు, రేషన్ కార్డు, అన్ని ఆపేస్తే బుద్ధి వస్తుంది ఏమో అంటున్నారు జనం. మందు కు, ప్రచారం కు, షికారు, షాపింగ్ కు కరోనా ఇబ్బందులు లేవు, కేవలం ఓటు కే నా? కరోనా లేనప్పుడు అంతే తక్కువ శాతం ఉంది కదా. ఓటు వేయకుండా, వీళ్ళు ఇంట్లో ఉంటే లేని తప్పు, కేసీయార్ అన్న ఫాం హౌస్ లో ఉంటే తప్పా? అని ఆయన అభిమానులు నిలదీసి అడుగుతున్నారు మనల్ని.

ఇక మన రాష్ట్ర విషయం, చుట్టూ ఇళ్ళు మనసులు మనుషులు తలగలబడుతుంటే అంటే చెడిపోతుంటే, వాటి మధ్యలో, మనం హాయిగా ఉండగలం, అనుకునేంత మూర్ఖత్వం తో, మన పెంపకం సాగింది సాగుతోంది అని అర్థం చేసుకోవాలేమో. ఆ నిప్పు (చెడు) కణాలు మన మీద పడతాయి, అని తెలుసుకోవడమే, జ్ఞానం విజ్ఞానం.

అందుకే మన పెద్దలు, సర్వే జనా సుఖినోభవంతు, అన్నారు. నేనొక్కడినే సుఖం గా ఉండాలి అని అనలేదు. అందరు గురించి, మనం ఆలోచన చేస్తే, వారు పచ్చ గా ఉంటే నే, మనం పచ్చ గా ఉంటాము. అది ఇప్పుడు ఎవరికీ ఎక్కదు, కరోనా వచ్చిన తర్వాత కూడా. ఇంకా పెద్ద విపత్తులు, మనల్ని మారుస్తాయి ఏమో, భవిష్యత్ లో చూడాలి.

ఎవరు ఎట్టాపోయినా, అస్సలు పట్టించుకోనండి, చుట్టూ జనాలు అలాగే రాజకీయాలు, అసలు వద్దు, అంటారా? అందుకే నాయకులు హైదరాబాద్ లో, కరోనా ఆసుపత్రిలో రోగం నయం చేయించుకుంటే, మన ఊళ్ళో ఆసుపత్రిలో నే, మనం మరియు మన వారసులు, దౌర్భాగ్య స్ధితిలో ప్రాణాలు విడుస్తున్నాము. వాళ్ళు, మనల్ని పట్టించుకోకుండా ఉంటుంది, అందుకే.

గతంలో వీళ్ళ ను, వాళ్ళు అవమానించారు అసెంబ్లీలో. ఇప్పుడు వీళ్ళు, వాళ్ళ ను అవమానిస్తున్నారు. వాళ్ళు వయస్సు లో పెద్ద వారు, పెద్దరికం, అప్పుడు ఉంచుకోవాలి. వీళ్ళు వయస్సు లో చిన్న వారు, వీళ్ళ గౌరవం మర్యాద సంస్కారం ఇప్పుడు నిలుపుకోవాలి. ఇద్దరూ తగ్గడం లేదు. ఈ చిన్న వాళ్ళ, అమర్యాద పగ రాజకీయాలు, చేస్తున్న అవమానాలు చూచి, రాబోయే తరం, ఇంకా పగ ప్రతీకారం నేర్చుకోవాలి. అంతే నా?

మరి అందరూ కలసి ఏమి చేస్తున్నారు, ఈ పాపాన్ని రెట్టింపు చేస్తున్నారు. వచ్చే 2024 అసెంబ్లీ కి కావల్సిన, మహా పాపాన్ని, సిద్ధం చేస్తున్నారు. నేనే సర్వం అనుకునే వారు, ఏనాటికైనా పతనం కాక తప్పదు. కొందరిని చూసాం, ఇంకొందరిని చూస్తాం భవిష్యత్తు లో. మరి వీళ్ళకి, వాళ్ళ కి, ఆ అమిత అధికార శక్తి ఇచ్చినది, ఎవరు?

ఇంకెవరన్నా, మన ఓటు వేసిన ప్రజలు మరియు అలాగే ఓటు వేయకుండా ప్రభుత్వ పధకాలను సౌకర్యాలు ను, అనుభవిస్తున్న కృతఘ్నులు. ఆ పాప ఫలితాలు ను అనుభవించబోయేదీ, వీరే మరియు వీరి వారసులే. అంటే మనమే.

మరి మీ లేదా మా ఊరుకు జిల్లా, పార్లమెంటు, హార్బర్, చేనేత పార్కు, స్మార్ట్ సిటీ, స్మార్ట్ బీచ్, నిమ్స్ ,అభివృద్ధి గురించి అడిగేది ఎవరు? తెచ్చేది ఎవరు? ఎప్పుడు?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,700; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092
Dt : 12-Feb-2020, Upd Dt : 12-Feb-2020, Category : Politics
Views : 752 ( + More Social Media views ), Id : 831 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , assembly , session , disgrace , actions , hyderabad , local , vote , kcr , jagan , chandra babu , percentage
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content